Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ankur Jain Married To Ex WWE Star Erika Hammond
మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు

భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్‌'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్‌ ఏప్రిల్ 26న ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్‌, అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.ఎవరీ ఎరికా హమ్మండ్?ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్‌నెస్ కోచ్‌గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్‌ కూడా స్టార్ట్ చేశారు.    View this post on Instagram           A post shared by Ankur Jain (@ankurjain)

Alakh Pandey Urges Indian Students At Harvard, Stanford
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్‌ వాలా పిలుపు

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్‌ ఫిజిక్స్‌ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్‌ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్‌ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ  యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు.      View this post on Instagram           A post shared by Physics Wallah (PW) (@physicswallah)

Users Report Telegram Outage for Second Time in Last 24 Hours
మోరాయించిన ప్రముఖ యాప్‌.. మీమ్స్‌ వైరల్‌!

ప్రముఖ సోషల్‌ మీడియా మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ టెలిగ్రామ్‌ సేవలు గడిచిన 24 గంటల్లో పలుసార్లు నిలిచిపోయాయి. యూజర్లు టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పంపడం, డౌన్‌లోడ్‌, లాగిన్‌ చేసేపుడు ఇబ్బందులకు గురైనట్లు ఫిర్యాదు చేశారు.దాదాపు 6700 మందికిపై టెలిగ్రామ్‌ పని చేయడం లేదని ఫిర్యాదులు చేసినట్లుగా డౌన్‌డిటెక్టర్‌ డేటా ద్వారా తెలిసింది. మొత్త ఫిర్యాదు చేసిన వారిలో 49 శాతం మంది మెసేజ్‌లు పంపించడంతో ఇబ్బందులు ఎదురైనట్లు చెప్పారు. 31 శాతం మంది యాప్‌ పనిచేయలేదని, 21 శాతం మంది లాగిన్‌ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.Twitter users to telegram users right now#telegramdown pic.twitter.com/X4gP9hYn1R— Dr.Duet🇵🇸 (@Drduet56) April 26, 2024ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, లక్నో, పాట్నా, జైపుర్, అహ్మదాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.అయితే ఇప్పటివరకు టెలిగ్రామ్‌ ఈ సమస్యపై స్పందించలేదు. ఇలా ప్రముఖ యాప్‌లో సమస్య ఎదురైందనే వార్త క్షణాల్లో వైరల్‌ అవ్వడంతో వాటికి సంబంధించి ట్విటర్‌లో చాలా మీమ్స్‌ చక్కర్లు కొట్టాయి.telegram users rn#telegramDownpic.twitter.com/wz7KYfLwIS— F. 🇵🇸🚩 (@aaatankwaadi) April 26, 2024

Railways Plans To Roll Out Vande Metro Trials To Begin In July 2024
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్‌డేట్‌

సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్ల భారీ విజయం తర్వాత ఇండియన్‌ రైల్వే దేశంలోని మొదటి వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోందని, ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను మార్చేందుకు ప్రణాళికలు వేస్తోందని ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు."2024 జూలై నుండి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా దీని సేవలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించవచ్చు" అని ఆ అధికారి చెప్పినట్లుగా ఎన్‌డీటీవీ పేర్కొంది. క్షణాల్లో వేగాన్ని అందుకునేలా, తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్‌లను కవర్ చేసేలా ఆధునిక టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఈ ట్రైన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.రైల్వే వర్గాల ప్రకారం, ఇది ఒక ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో నాలుగు కోచ్‌లు ఒక యూనిట్‌గా ఉంటాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్‌లు ఒక వందే మెట్రోలో ఉంటాయి. తర్వాత డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌లను 16 వరకు పెంచుతారు.

Today Gold and Silver Price 28 April 2024
స్థిరంగా బంగారం, వెండి.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 200 నుంచి రూ. 200 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.200, రూ.220 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72760 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా ఈ రోజు ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 28) ఒక కేజీ వెండి ధర 84000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

Elon Musk Heads To China In A Surprise Visit
భారత పర్యటన రద్దు.. అకస్మాత్తుగా చైనాలో ప్రత్యక్షమైన మస్క్‌

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌ చైనాలో ప్రత్యక్షమయ్యారు. గత కొంత కాలంగా మస్క్‌ సారథ్యంలోని టెస్లా భారత్‌లో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం మస్క్‌ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.కేంద్రం సైతం మస్క్‌ ఏప్రిల్‌ నెల 21, 22 తేదీలలో వస్తున్నారంటూ సూచనప్రాయంగా తెలిపింది. కానీ పలు అన్వేక కారణాల వల్ల భేటీ రద్దయింది.  అయితే ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ తన ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ (ఎఫ్‌ఎస్‌డీ)కార్లలోని సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసేందుకు,ఎఫ్‌ఎస్‌డీ అల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశంలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేసేందుకు  కావాల్సిన అనుమతులను పొందేందుకు బీజింగ్‌లోని చైనా అధికారులతో భేటీ కానున్నారు.మరోవైపు ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లపై ఎక్స్‌లో చర్చ మొదలైంది.దీనిపై మస్క్‌ స్పందిస్తూ అతి త్వరలో డ్రాగన్‌ కంట్రీలో ఎఫ్‌ఎస్‌డీ కార్లు అందుబాటులోకి రానుందని తెలిపారు.   

Veteran Private Banker Abhay Aima passes away
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అభయ్ ఐమా కన్నుమూశారు. శనివారం సాయంత్రం ఆయన 63 ఏళ్ల వయసులో ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన చిరకాల మిత్రుడు, జమ్మూకశ్మీర్ మాజీ  ఆర్థిక మంత్రి హసీబ్ ద్రాబు ఈ విషయం వెల్లడించారు.హసీబ్ ద్రాబు ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్)లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఐమా సాయెబా, ఇక లేరు! చిన్ననాటి స్నేహితుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడు. శ్రీనగర్, ముంబైలో ఐదు దశాబ్దాల అనుబంధం ఒక నిమిషంలో ముగిపోయింది" అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాంతాక్రూజ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని ద్రాబు వేరే పోస్ట్‌లో తెలిపారు.బ్యాంకింగ్‌లో అత్యుత్తమ పదవులు నిర్వహించిన ఐమా 2020లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి పదవీ విరమణ చేశారు. 2021లో స్పైస్ మనీ అడ్వైజరీ బోర్డులో చేరారు. 1995లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో చేరడానికి ముందు, ఐమా సిటీ బ్యాంక్‌లో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన ఐమా, బ్యాంకింగ్‌ రంగానికి రాక ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావడానికి కృషి చేశారు.

Semiconductor Startups Increasing In India For Export To Other Countries
సెమీకండక్టర్లను ఎగుమతి చేస్తున్న భారత్‌.. ప్రధాన స్టార్టప్‌లు ఇవే..

సెమీకండక్టర్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారుచేసుకుని ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసే స్థాయికి భారత్‌ చేరుతోంది. దాంతో దేశీయంగా ఉన్న లిస్టెడ్‌ కంపెనీలు ఇప్పటికే వీటి తయారీలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్‌ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావించి చాలా స్టార్టప్‌ కంపెనీలు ఈ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు దేశీయంగా సెమీకండక్టర్‌ చిప్‌లను తయారుచేస్తున్నాయి.సాంఖ్యల్యాబ్స్‌మైండ్‌గ్రోడ్‌టెర్మినస్‌ సర్క్యూట్స్‌మార్ఫింగ్‌ మిషన్‌ఫెర్మియానిక్‌ఓక్టర్‌ఆగ్నిట్‌ఇన్‌కోర్‌సైన్‌ఆఫ్‌సిలిజియం సర్క్యూట్స్‌ఔరసెమిసెమీకండక్టర్‌ విభాగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో టి-హబ్‌, నీతి ఆయోగ్‌తో కలిసి అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ కింద కోహర్ట్‌-2 కార్యక్రమాన్ని గతంలో చేపట్టాయి. ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ఎంపిక చేసి, 6 నెలల పాటు వాటి ఎదుగుదలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి. దీని కోసం ఇప్పటికే అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ఫేస్‌ఇంటెల్‌ సిస్టమ్స్‌, క్లూపే సైంటిఫిక్‌, డీప్‌ గ్రిడ్‌ సెమి, సెగో ఆటోమొబైల్‌ సొల్యూషన్‌, స్పైడెక్స్‌ టెక్నాలజీస్‌, జియోకాన్‌, ఛిపెక్స్‌ టెక్నాలజీస్‌, జీలీ స్మార్ట్‌ సిస్టమ్‌ ఉన్నాయి.

Office Space Leasing In Hyderabad rose to 22 7 lakh square feet vestian
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్‌ లీజింగ్‌

దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్‌ స్థలాల లీజింగ్‌లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది.2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్‌ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది.  అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్‌ స్థలాల డిమాండ్‌ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.హైదరాబాద్‌లో భారీగా లీజింగ్‌  హైదరాబాద్‌లోనూ ఆఫీస్‌ స్థలం లీజింగ్‌ భారీగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు వెస్టియన్‌ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్‌ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది.ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో కూడా 40 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా ఆఫీస్‌ లీజింగ్‌లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వాటా 61 శాతంగా ఉంది. ఈ మూడు నగరాల్లో వాటా 54 శాతం పెరిగింది. అయితే బెంగళూరులో ఆఫీస్‌ లీజింగ్‌ 33 లక్షల చదరపు అడుగుల నుంచి 26.2 లక్షల చదరపు అడుగులకు పడిపోవడం గమనార్హం.ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీస్‌ స్థలం లీజు 12 లక్షల అడుగుల నుంచి 24.9 లక్షలకు పెరగడం విశేషం. కోల్‌కతాలో మాత్రం 3.5 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల అడుగులకు పడిపోయింది. పుణెలో ఆఫీస్‌ స్థలం సగానికి సగం పడిపోయింది. ఏడాది క్రితం 15 లక్షల చదరపు అడుగులు కాగా, ఈ సారి 7.1 లక్షల చదరపు అడుగులకు జారుకుంది.ఇక రంగాలవారీగా తీసుకుంటే ఐటీ, ఐటీఈఎస్‌ రంగానికి చెందిన సంస్థలు అధికంగా ఆఫీస్‌ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. వీటి వాటా 47 శాతంగా ఉంది. అలాగే బీఎఫ్‌ఎస్‌ఐ రంగం వాటా 11 శాతంగా ఉంది.

Every Minute 500 Hours Of Content Been Uploaded
నిమిషానికి 500 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌.. యూట్యూబ్‌ ప్రస్థానం ఇదే..

ఒక నిమిషానికి దాదాపు 500 గంటల కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తున్న యూట్యూబ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఫిబ్రవరి 14, 2005లో పేపాల్‌లో పనిచేస్తున్న స్టీవ్ చెన్‌, చాడ్ హార్లీ, జావెద్ కరీం యూట్యాబ్‌ను రూపొందించారు.2005 ఏప్రిల్‌ 23న ‘మీ ఎట్‌ ది జు’ అనే వీడియోను మొదటగా అప్‌లోడ్‌ చేశారు.మే 2005లో యూట్యూబ్‌ బెటా సైట్‌ను ప్రారంభించారు.సెప్టెంబర్‌ 2005లో మొదటగా 1 మిలియన్‌ మంది వీక్షించిన వీడియా ‘నైక్‌’ యాడ్‌.నవంబర్‌ 2005లో మొదటగా 3.5 మిలియన్‌ డాలర్లతో సెకోయా క్యాపిటల్‌ పెట్టుబడి పెట్టింది.మార్చి 2006లో మొదటగా యూట్యూట్‌లో ప్రకటనలు ప్రారంభించారు.జులై 2006 వరకు సగటున రోజూ 100 మిలియన్‌ వీక్షణలు వచ్చాయి.అక్టోబర్‌ 9, 2006లో యూట్యూబ్‌ను 1.65 బిలియన్‌ డాలర్లకు గూగుల్‌ కొనుగోలు చేసింది.యూట్యూబ్‌ వీడియో అప్‌లోడర్లుకు 2007 నుంచి అవార్డులను ప్రకటిస్తోంది.2008లో యూట్యూబ్‌ సినిమాలు, టీవీ షోలను అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టింది.జనవరి 2010లో మూవీ రెంటల్‌ సర్వీస్‌ను తీసుకొచ్చింది.మార్చి 2010లో ఉచితంగా స్పోర్ట్స్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ను ప్రారంభించింది.మే 2010లో రోజూ సగటున 2 బిలియన్‌ వీక్షణలు వచ్చేవి.2011లో 3 బిలియన్‌ వీక్షణలకు చేరింది.జనవరి 2012లో రోజూ 4 బిలియన్‌ వ్యూస్‌ వచ్చేవి.2012లో ప్రతి నిమిషానికి 60 గంటల కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేంది. ప్రతినెల కొత్తగా 800 మిలియన్ల మంది యూట్యూబ్‌ చూసేవారు.మొదటగా 2012 డిసెంబర్‌ 21న 1 బిలియన్‌ వ్యూస్‌ వచ్చిన వీడియా.. ‘గంగనమ్‌ స్టైల్‌’.మార్చి 2013లో 1 బిలియన్‌ యూజర్ల మార్కును తాకింది.సుసాన్ వోజ్కి ఫిబ్రవరి 2014లో యూట్యూబ్ సీఈఓగా నియమితులయ్యారు.యూట్యూబ్‌ కిడ్స్‌ అని పిలువబడే మొబైల్ యాప్‌ను యూట్యూబ్‌ 2015లో విడుదల చేసింది.2017 ఫిబ్రవరి నాటికి ప్రతి నిమిషానికి 400 గంటల నిడివి ఉన్న కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేది.ఆగస్టు 2017లో సర్వీస్ ప్లే బటన్‌తో లోగోను రీడిజైన్ చేశారు.ఏప్రిల్ 3, 2018న కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనోలో ఉన్న యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో కాల్పులు జరిగాయి.2019 నాటికి ప్రతి నిమిషానికి 500 గంటల నిడివి ఉన్న కంటెంట్‌ అప్‌లోడ్‌ అయ్యేది.పింక్‌ఫాంగ్ ఛానల్‌కు చెందిన బేబీ షార్క్ డ్యాన్స్‌ వీడియో వ్యూస్‌ జనవరి, 2022 నాటికి 1400 కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. 2016 జూన్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ చేశారు.ఇదీ చదవండి: గూగుల్‌లో 20 ఏళ్ళు.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్అత్యంత వయసు కలిగిన యూట్యూబర్‌గా ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గుడివాడ గ్రామానికి చెందిన కర్రి మస్తానమ్మ(107) రికార్డు నెలకొల్పారు.యూట్యూబ్‌లో 70 శాతం ట్రాఫిక్‌ మొబైల్‌ ఫోన్ల ద్వారానే వస్తోంది.96 శాతం టీనేజర్లు దీన్ని వినియోగిస్తున్నారు.91 దేశాల్లో ఇది సేవలందిస్తోంది.యూట్యూబ్‌ 80 భాషల్లో సేవలందిస్తోంది. దాదాపు 95 శాతం మంది తమ స్థానిక భాషలో వీడియోలు వీక్షించవచ్చు. 

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 65.70 75.20

Egg & Chicken Price

Title Price Quantity
Egg 100.00 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement