టాప్ 10 గ్లోబల్ సీఈఓల్లో భారత సంతతి
By Sakshi

న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అగ్రశేణి 10 కంపెనీల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)ల జాబితాలో.. ఏకంగా ముగ్గురు భారత సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్బీఆర్) రూపొందించిన ఈ ఏడాది టాప్-100 ప్రపంచ సీఈఓల్లో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ 6వ స్థానంలో నిలిచారు. ఆ తరువాత స్థానంలో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా ఉండడం విశేషం కాగా.. తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9వ ర్యాంకులో నిలిచారు. తొలి పది స్థానాల్లో ముగ్గురు భారత సంతతి వారు ఉండగా.. పూర్తి జాబితాలో డీబీఎస్ బ్యాంక్ పియూష్ గుప్తా 89వ స్థానంలో నిలిచి మొత్తం భారత సంతతి సంఖ్యను నాలుగుకు పెంచారు. 62వ స్థానంలో టిమ్కుక్...
గ్లోబల్ టాప్ 100 జాబితాలో నైక్ సీఈఓ మార్క్ పార్కర్ (20), జేపీ మోర్గాన్ చీఫ్ జామీ డిమోన్ (23), లాక్హీడ్ మార్టిన్ సీఈఓ మారిలిన్ హ్యూసన్ (37), డిస్నీ సీఈఓ రాబర్ట్ (55), ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (66), సాఫ్ట్బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ (96) ర్యాంకుల్లో ఉన్నారు. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అగ్రస్థానంలో నిలిచారు.
You may be interested
300 విమానాలకు ఇండిగో ఆర్డరు
Wednesday 30th October 2019విలువ సుమారు రూ. 2.3 లక్షల కోట్లు ముంబై: భారీ వృద్ధి ప్రణాళికల అమల్లో భాగంగా విమానయాన రంగ సంస్థ ఇండిగో తాజాగా 'ఎయిర్బస్ 320 నియో' రకానికి చెందిన 300 విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ఒక్కో విమానం రేటు వివరాలు వెల్లడించనప్పటికీ.. 2018లో ప్రచురించిన ధర ప్రకారం ఈ ఆర్డరు విలువ సుమారు 33 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 2.3 లక్షల కోట్లు) ఉండొచ్చని అంచనా. ఇంత పెద్ద
భారత్లో అమెజాన్ భారీ పెట్టుబడి
Wednesday 30th October 2019మార్కెట్ ప్లేస్, రిటైల్, అమెజాన్ పేలో నూతనంగా రూ. 4,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్ న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. భారత మార్కెట్లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ. 4,400 కోట్లను ఇక్కడి మార్కెట్లో పెట్టుబడిగా పెట్టనుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించిన తాజా సమాచారం మేరకు.. అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్ డాట్ కామ్ ఇంక్ సంస్థలు