2021 మే నాటికి ‘వీర’ అనంత ప్లాంటు
By Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:- బస్సుల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ వీర వాహన ఉద్యోగ్ అనంతపూర్లో నెలకొల్పనున్న ప్లాంటు 2021 మే నాటికి సిద్ధం కానుంది. గుడిపల్లి వద్ద కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయించింది. నిర్మాణ పనులు ప్రారంభించామని వీర వాహన ఉద్యోగ్ ఎండీ కె.శ్రీనివాస్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏటా 3,000 బస్ల తయారీ సామర్థ్యంతో రానున్న ఈ కేంద్రానికి తొలి దశలో రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. తొలి దశ పూర్తి కాగానే రూ.300 కోట్లతో రెండవ దశకు శ్రీకారం చుడతామన్నారు. తద్వారా మరో 1,000 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
బ్యాటరీ మన్నిక 20 ఏళ్లు...
విమానాశ్రయాల్లో వినియోగించే టార్మాక్ ఎలక్ట్రిక్ కోచ్లను అనంతపూర్ ప్లాంటులో తొలుత తయారు చేస్తారు. బస్సులో 100 మంది ప్రయాణించొచ్చు. 100 కిలోవాట్ అవర్ సామర్థ్యంగల బ్యాటరీలను పొందుపరుస్తారు. ఒకసారి చార్జీ చేస్తే బస్సు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అలాగే 38 సీట్ల (65 మంది ప్రయాణించే) కెపాసిటీగల ఎలక్ట్రిక్ సిటీ బస్లను రూపొందించనున్నారు. వీటికి 120 కిలోవాట్ అవర్ సామర్థ్యంగల బ్యాటరీని వాడతారు. ఒకసారి చార్జ్ చేస్తే 80-100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 15 నిముషాల్లోనే చార్జింగ్ పూర్తి కావడం ఈ అత్యాధునిక బ్యాటరీల ప్రత్యేకత. రోజుకు మూడుసార్లు చార్జ్ చేసినా బ్యాటరీ జీవిత కాలం 18-20 ఏళ్లపైమాటేనని కంపెనీ తెలిపింది.
ఏటా 10,000 బస్సులు..
భవిష్యత్తులో ఇక్కడ 12-18 సీట్లు ఉండే చిన్న ఎలక్ట్రిక్ బస్లనూ తయారు చేస్తామని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఏటా 10,000 యూనిట్లు ఉత్పత్తి చేస్తాం. ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి పెద్ద పీట వేస్తాం. ఫ్యాక్టరీలో డీజిల్, హైబ్రిడ్ మోడళ్లనూ రూపొందిస్తాం. అనంత ప్లాంటు సమీపంలో అనుబంధ పరిశ్రమలూ వస్తాయి. ఇక బెంగళూరు ప్లాంటు నుంచి ఏటా 1,000కిపైగా బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ వినియోగిస్తున్న టార్మాక్ బస్లన్నీ వీర బ్రాండ్వే. ఈ ఏడాది 50 బస్సులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. దేశంలో ల్యాడర్ ఫ్రేమ్, మోనోకాక్, స్పేస్ ఫ్రేమ్ బస్లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ మాదే’ అని వివరించారు.
You may be interested
భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం
Saturday 23rd November 2019యువత నిరుద్యోగ సమస్యపై ఈఐయూ విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది, ఒక రకంగా చెప్పాలంటే యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు
పెట్టుబడుల ఆకర్షణ మంత్రం
Saturday 23rd November 2019భారీ ప్రోత్సాహకాలపై కేంద్రం కసరత్తు 324 విదేశీ దిగ్గజ సంస్థలపై దృష్టి జాబితాలో టెస్లా, గ్లాక్సో తదితర కంపెనీలు అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థలను ఇటు రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది. టెస్లా, గ్లాక్సోస్మిత్క్లైన్ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు