ఆధార్ ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ.2లక్షల రుణం
By Sakshi

న్యూఢిల్లీ: వేదాంత లిమిటెడ్ అధినేత అనిల్ అగర్వాల్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు కీలక సూచనలు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని, ఆధార్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.2లక్షల చొప్పున రుణం ఇవ్వాలని ప్రధానంగా సూచించారు. దీనివల్ల ప్రభుత్వరంగ సంస్థలు మూడు రెట్లు గొప్పగా పనిచేయగలవన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించొచ్చని, ఉద్యోగాలను సృష్టించొచ్చని సూచించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సూచనలు చేశారు. భారత పరిస్థితిని ‘మదర్ఇండియా’ సినిమాతో పోల్చారు. ‘‘ఆ సినిమాలో రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణమిచ్చిన వారు పట్టుకుపోతారు. అలాగే, భారత్లోనూ 50 శాతం ఆదాయాలను దిగుమతులపైనే ఖర్చు చేస్తున్నాం. ఆ తర్వాత వడ్డీలకు చెల్లింపులు పోగా మిగిలేది ఏమీ లేదు’’ అని అగర్వాల్ పేర్కొన్నారు. సహజవనరులు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికితీయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
You may be interested
ఆయిల్, చమురు బ్లాక్ల వేలం...
Monday 10th June 2019ఓఎన్జీసీ, వేదాంత, ఆయిల్ ఇండియా టాప్ ఈ మూడింటికే 30 బ్లాక్లు రిలయన్స్, బీపీకి కేజీ బేసిన్ బ్లాక్ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ఇండియా, ఓఎన్జీసీతోపాటు అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ తాజాగా ముగిసిన చమురు, గ్యా్స్ బ్లాక్ల వేలంలో టాప్-3గా నిలిచాయి. రెండో దశ ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్పీ) కింద 14 ఆయిల్, గ్యాస్ బ్లాక్లు, మూడో దశ ఓఏఎల్పీ కింద మరో 18 ఆయిల్, గ్యాస్, 5 కోల్బెడ్
వాణిజ్య ఉద్రిక్తతలు ... ప్రపంచ ఆర్థికానికి ముప్పు
Monday 10th June 2019జీ 20 ప్రకటన ఫుకోవా (జపాన్): వాణిజ్య ఉద్రిక్తతలు అధ్వానంగా మారాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని జీ20 దేశాలు అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉండగా, వాణిజ్య ఉద్రిక్తతల రిస్క్తో ఇది ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన జీ20 దేశాల ప్రకటనలో వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతలు తీత్రతరం అయ్యాయని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు