కియా తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
By Sakshi

- బీట్ 360 పేరుతో గురుగ్రామ్లో ఏర్పాటు గురుగ్రామ్: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. తాజాగా తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ‘బీట్ 360’ పేరుతో 5,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను ఇక్కడ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ, సీఈఓ కూక్ హున్ షిమ్ మాట్లాడుతూ.. ‘కియా భవిష్యత్ వ్యూహాలను ఈ సెంటర్ వివరిస్తుంది. భారత్లో నూతన ప్రామాణాలను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించనుంది. భారత్లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దగ్గర నుంచి వినియోగదారుల మా సంస్థపైనే దృష్టి సారిస్తున్నారు. నిజమైన కియా అనుభవాన్ని అందించడానికి వీరితో అనుసంధానం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఈ సెంటర్ పేరులోని మొదటి పదం బీటింగ్ ఆఫ్ హార్డ్కు సంక్షిప్తం. సంస్థ వ్యాపార ప్రాంతాలు (జోన్స్)కు సంకేతంగా 3, ఇంద్రియాలను సూచిస్తూ 6, హద్దులు లేవని చెప్పేందుకు 0 ఎంపిక చేసి 360 అని నిర్ణయించాం. త్వరలోనే దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇటువంటి సెంటర్లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నాం. అని వ్యాఖ్యానించారు. 50,000 బుకింగ్స్ పూర్తి
- సెప్టెంబర్ దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు
సెప్టెంబర్ నెల్లో కియా దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు కాగా, కారు విడుదలైన ఆగస్టు 22 నుంచి గతనెల చివరివరకు మొత్తం విక్రయాలు 13,990 యూనిట్లుగా నమోదయ్యాయి. బుకింగ్స్ 50,000 యూనిట్ల మార్కును అధిగమించాయి.
You may be interested
1,500 డాలర్ల దిగువకు బంగారం!
Friday 11th October 2019యుఎస్-చైనా ప్రతినిధుల మధ్య గురువారం ప్రారంభమైన వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్ ట్వీట్ చేయడంతో శుక్రవారం ట్రేడింగ్లో బంగారం ధరలు తగ్గాయి. తక్షణ బంగారం 0.2 శాతం తగ్గి 1,491.12 డాలర్లకు చేరుకోగా, యుఎస్ గోల్డ్ ప్యూచర్స్ 0.2 శాతం నష్టపోయి 1,498.50 డాలర్లకు చేరుకుంది. యుఎస్-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య గత
పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు
Friday 11th October 2019-ఆర్బీఐ తాజా రేట్ల తగ్గింపుతో సానుకూలత న్యూఢిల్లీ: గత నెలలో ఆర్బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు) రుణాలపై రేట్లను పావు శాతం వరకు తగ్గించాయి. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాలు చౌకగా మారాయి. ఆర్బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగానే .. రిటైల్ విభాగం, ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలపై రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు, రెపో