బీమా పండటం లేదు
By Sakshi

న్యూఢిల్లీ: పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) అంటే.. బీమా కంపెనీలు భయపడిపోతున్నాయి! ప్రకృతి విపత్తుల కారణంగా పరిహారం కోరుతూ భారీగా క్లెయిమ్లు వస్తుండడం, ఫలితంగా ఈ విభాగంలో వస్తున్న భారీ నష్టాలతో కంపెనీలు పునరాలోచనలో పడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పథకం కింద క్రాప్ ఇన్సూరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ సైతం ఈ విభాగం నుంచి తప్పుకున్నట్టు డేటా తెలియజేస్తోంది. అయినా, కొన్ని కంపెనీలు మాత్రం ఈ విభాగం పట్ల ఆశావహంగానే ఉన్నాయి. పీఎంఎఫ్బీవై కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో వసూలైన స్థూల ప్రీమియం రూ.20,923 కోట్లు. కాగా, బీమా కంపెనీలకు పరిహారం కోరుతూ వచ్చిన క్లెయిమ్ల మొత్తం రూ.27,550 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగంలోని రీఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీఆర్ఈ) సైతం తన క్రాప్ ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియోను భారీ నష్టాల కారణంగా తగ్గించుకోవడం గమనార్హం. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటాను పరిశీలిస్తే.. చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్థూల ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 91 శాతం తగ్గిపోయి రూ.5.26 కోట్లుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన స్థూల ఆదాయం రూ.211 కోట్లుగా ఉంది.
పెరిగిన స్థూల ప్రీమియం...
పంటల బీమా విభాగంలో అన్ని సాధారణ బీమా కంపెనీలకు స్థూల ప్రీమియం ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో పెరగడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.15,185 కోట్లతో పోలిస్తే 26.5 శాతం వృద్ధి చెంది రూ.19,217 కోట్లకు చేరుకుంది. ‘‘క్రాప్ ఇన్సూరెన్స్ మంచి పనితీరునే ప్రదర్శిస్తోంది. కొన్ని విభాగాల్లో క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంది. అయినప్పటికీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విభాగంపై బుల్లిష్గానే ఉన్నాయి’’అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది మరిన్ని సంస్థలు ఈ విభాగంలోకి తిరిగి ప్రవేశిస్తాయని పేర్కొన్నాయి.
ప్రభుత్వ సంస్థల పెద్దపాత్ర...
క్రాప్ ఇన్సూరెన్స్లో నష్టాల పేరుతో ప్రైవేటు కంపెనీలు తప్పుకున్నా కానీ, ప్రభుత్వరంగ బీమా సంస్థలు పెద్ద పాత్రే పోసిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే నేషనల్ ఇన్సూరెన్స్, న్యూఇండియా ఇన్సూరెన్స్ కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు పంటల బీమాలో వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ప్రభుత్వరంగ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ అధిక మొత్తంలో క్రాప్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటుండడం గమనార్హం. ఇటీవల రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్గుప్తా.. ఈ ఏడాది ఎటువంటి క్రాప్ బీమా వ్యాపారాన్ని నమోదు చేయబోవడం లేదని ప్రకటించారు. రీ ఇన్సూరెన్స్ చార్జీలు ఎంతో ప్రతికూలంగా ఉన్నాయని, రేట్లు నేలపైకి దిగిరావాల్సి ఉందన్నారు.
ఈ రంగంలో పరిస్థితులు ఇలా..
You may be interested
ఐబీసీ కింద ఆర్థిక సేవల సంస్థలకూ పరిష్కారం: సాహూ
Tuesday 12th November 2019న్యూఢిల్లీ: దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లో ఆర్థిక సేవల సంస్థలకు సంబంధించి కూడా పరిష్కార క్లాజ్ ఉందన్నారు దివాలా అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) చైర్పర్సన్ ఎంఎస్ సాహూ. ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) అమల్లోకి వచ్చేంత వరకు ఈ నిబంధన కింద పరిష్కారాన్ని కోరవచ్చన్నారు. ఏదేనీ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ (ఆర్థిక సేవలను అందించే సంస్థ)ను దివాలా చర్యల కింద నోటిఫై చేసే
రూపాయికి టారిఫ్ల సెగ!
Tuesday 12th November 201919 పైసలు క్షీణించి 71.47 వద్ద ముగింపు ముంబై: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలపై తాజాగా నెలకొన్న అనుమానాలు భారత్ కరెన్సీపై ప్రభావం చూపాయి. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 71.47 వద్ద ముగిసింది. అక్టోబర్ 15 తర్వాత రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ భారత్ అవుట్లుక్కు కోత పెట్టడం కూడా రూపాయి