బ్యాంకింగ్ రంగ భవిష్యత్తుకు ఐడియాలివ్వండి
By Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ ఓ వినూత్న ప్రయత్నానికి బీజం వేసింది. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా... దీన్ని సాధించేందుకు గాను బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టాలని భావించింది. ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ ఓ నెల రోజుల పాటు బ్రాంచ్ల స్థాయిలో అధికారులతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టి.. వారి సలహాలు స్వీకరించాలని కోరింది. శనివారాల్లో దీన్ని చేపట్టాలని వారిచ్చిన సూచనలను, బ్యాంకింగ్ రంగ భవిష్యత్తు వృద్ధికి రోడ్మ్యాప్ రూపకల్పనలో వినియోగించాలని సూచించింది. దిగువ స్థాయి నుంచి ఈ సంప్రదింపుల ప్రక్రియ ఉంటుందని, బ్రాంచ్ల స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరుగుతుందని ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్లకు పంపిన లేఖలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తొలుత బ్రాంచ్ లేదా ప్రాంతీయ స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సలహాల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం, ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశం ఉంటుంది. 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో కీలక భాగస్వాములైన ప్రభుత్వరంగ బ్యాంకుల పాత్రను గుర్తించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలుస్తోంది.
You may be interested
బలహీన డిమాండ్తో వృద్థికి అడ్డంకులు
Saturday 17th August 2019న్యూఢిల్లీ: భారత్ వృద్ధి, ద్రవ్యోల్బణం విషయంలో మెరుగ్గా ఉన్నప్పటికీ బలహీన డిమాండ్, ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానం బదిలీ కాకపోవడం రెండు అతిపెద్ద సవాళ్లని గోల్డ్మ్యాన్ శాక్స్ పేర్కొంది. 2010-2014 మద్య జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 7.3 శాతానికి పెరగ్గా, సగటు ద్రవ్యోల్బణం 10 శాతం నుంచి 5 శాతానికి క్షీణించింది. ‘‘వృద్ధి రేటు బలంగా ఉన్నా కానీ, మొత్తం మీద పెట్టుబడుల వాతావరణం చాలా
గుడ్బై ... ఎయిరిండియా..!
Saturday 17th August 201995 శాతం వాటాల అమ్మకం ప్రైవేటీకరణ నిబంధనలు కూడా సడలింపు వాటాలు తక్షణం అమ్ముకోవడానికి కొనుగోలుదారులకు వెసులుబాటు విక్రయ ప్రతిపాదనలపై కేంద్రం కసరత్తు అక్టోబర్ నాటికి ఈవోఐ న్యూఢిల్లీ: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ ప్రక్రియను ఈసారైనా కచ్చితంగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడంపై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశం