ఏడాది కనిష్ఠాన్ని తాకిన 115 స్టాకులు
By Sakshi

ఎన్ఎస్ఈ మంగళవారం సెషన్లో సుమారుగా 115 స్టాకులు వాటి 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. కెనరా బ్యాంక్, డీబీ కార్ప్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, షెమరూ ఎంటర్టైన్మెంట్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఫోర్జ్ షేర్లు వాటి 52 వారాల కనిష్టాన్ని తాకిన స్టాక్లలో ఉన్నాయి. వీటితోపాటు అడోర్ వెల్డింగ్, అరవింద్ ఫ్యాషన్స్, భారతీయ ఇంటర్నేషనల్, బటర్ఫ్లై గాంధీమతి అప్లైన్స్, సీఈఎస్సీ వెంచర్స్, డైనమేటిక్ టెక్నాలజీస్, వర్ధమాన్ టెక్స్టైల్స్ షేర్లు కూడా వాటి ఏడాది కనిష్ఠాన్ని తాకాయి. నిఫ్టీ మంగళవారం ట్రేడింగ్లో 225.35 పాయింట్లు కోల్పోయి 10,797.90 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ 769.28 పాయింట్లు కోల్పోయి 36,562.91 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్లో టెక్ మహింద్రా, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ముగియగా, మిగిలిన 48 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఈ ఇండెక్స్లో ఇండియా ఆయిల్ కార్ప్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, వేదాంతా షేర్లు నష్టపోయిన షేర్లలో ముందున్నాయి
You may be interested
అమ్మకాల సునామీ....సెన్సెక్స్ 770 పాయింట్లు క్రాష్
Tuesday 3rd September 2019మార్కెట్ను ముంచెత్తిన ఆర్థిక మాంద్య భయాలు ఆర్థిక మందగమన భయాలు మార్కెట్ను మరోసారి ముంచేశాయి. మార్కెట్ ప్రారంభం నుంచి అమ్మకాలు వెల్లువలా సాగడంతో నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 10800 దిగువున 10,797.90 వద్ద, సెన్సెక్స్ 770 పాయింట్లను కోల్పోయి 36,563 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ మినహా అన్నిరంగాలకు చెందిన షేర్లల్లో విపరీతంగా అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల పతనంతో బ్యాంక్
బేరిష్ మార్కెట్లో ఏడాది గరిష్ఠాన్ని తాకిన 15 స్టాకులు
Tuesday 3rd September 2019ఎన్ఎస్ఈలో మంగళవారం 15 స్టాకులు మార్కెట్ బేరిష్ కదలికలను తట్టుకొనివాటి 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. అబాట్ ఇండియా, బాటా ఇండియా, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ), హిందుస్తాన్ ఫుడ్స్, ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్, లిబాస్ డిజైన్స్, మెట్రోపోలిస్ హెల్త్కేర్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) షేర్లు వాటి ఏడాది గరిష్ఠాన్ని తాకిన షేర్లలో ఉన్నాయి. మధ్యాహ్నా 3.03 సమయానికి నిఫ్టీ