ప్రధాన వార్తలు
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) ఇండియా మిషన్ డైరెక్టర్ 'వీణా రెడ్డి' హైదరాబాద్లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ క్వాల్కమ్ ఇండియాకు సంబంధించిన ఓఆర్ఏఎన్ రీసెర్చ్ ల్యాబ్లను సందర్శించారు. ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ముందుకు సాగుతుందో గమనించారు.యూఎస్ఏఐడీ 5జీ అండ్ ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్లతో సహా కొత్త వైర్లెస్ టెక్నాలజీలను పరీక్షించడంలో భారతీయ టెలికమ్యూనికేషన్ కంపెనీలకు కొన్ని సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది టెలికమ్యూనికేషన్ హార్డ్వేర్ అమెరికన్ సరఫరాదారు అయిన 'క్వాల్కమ్ టెక్నాలజీ'.క్వాల్కమ్ టెక్నాలజీ సహకారంతో.. భారతీయ టెలికామ్ రంగం కొత్త ఆవిష్కరణలకు పునాది వేస్తుంది, తద్వారా అనేక గ్లోబల్ అప్లికేషన్ల పరిష్కారాలు సాధ్యమవుతాయి. ఈ సందర్భంగా వీణా రెడ్డి మాట్లాడుతూ.. జీ20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా చెప్పినట్లుగానే యునైటెడ్ స్టేట్స్, భారతదేశంలో విశ్వసనీయ టెలికమ్యూనికేషన్స్ వృద్ధి చెందుతాయని అన్నారు.డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక శ్రేయస్సును పెంచడమే ప్రధాన లక్ష్యం. భారతదేశంలో సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైర్లెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్లకు మెరుగుపరచడానికి మేము ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని వీణా రెడ్డి పేర్కొన్నారు.
భారతీయ పర్యాటకులకు శుభవార్త.. ఇక ఆ దేశంలో 'ఫోన్ పే' సేవలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలుదేశాల్లో అందుబాటులో ఉన్న 'ఫోన్ పే' ఇప్పుడు తాజాగా 'లంకాపే'తో చేతులు కలిపింది. ఇది భారతీయ పర్యాటకులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.శ్రీలంకకు వెళ్లే భారతీయులు ఇకపై ఫోన్ పే యాప్తో లంకాపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఫోన్ పే సేవలు సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీలంక దేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.శ్రీలంకలో ప్రారంభమైన ఫోన్ పే సేవల సందర్భంగా.. లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ, భారతీయ పర్యాటకులు, బిజినెస్ ప్రయాణీకులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక గవర్నర్ నందలాల్ వీరసింగ్ స్పందిస్తూ.. పోటీతత్వాన్ని, శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంకింగ్ అండ్ టూరిజం రంగాల ప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సహా శ్రీలంకకు చెందిన ముఖ్య వాటాదారులు హాజరయ్యారు.
బుకింగ్స్లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం
గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024
మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్ 50 ఫ్యూజన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్మల్లౌ బ్లూ కలర్వేస్లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్లు) pOLED కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కామ్ 4ఎన్ఎం స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై-6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి.
పుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 194 పాయింట్లు లాభపడి 22,394 వద్దకు చేరింది. సెన్సెక్స్ 649 పాయింట్లు పుంజుకుని 73,636 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, భారతీఎయిర్ఎల్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, నెస్లే కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
క్యాన్సర్తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్తో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె 2015 నుంచి సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.అనితా గోయల్ కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనిత 1979లో మార్కెటింగ్ అనలిస్ట్గా కంపెనీలో చేరారు. ఆమె మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్గా ఎదిగిన తర్వాత నరేష్ గోయల్తో పరిచయం ఏర్పడింది. వారు కలిసిన తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.మనీలాండరింగ్ కేసులో 2023లో జైలుకెళ్లిన ఆమె భర్త నరేష్గోయల్కు వైద్యకారణాల వల్ల బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ ఇచ్చింది. భర్త జైల్లోనుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే భార్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది.
టెక్ మహీంద్రా మాజీ చీఫ్ వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా లిమిటెడ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. వినీత్ నయ్యర్ మృతిపై పలువురు ప్రముఖలు తమ సంతాపాన్ని తెలియజేశారు."భారత్ ఈరోజు అత్యుత్తమ నాయకుడిని కోల్పోయింది" అని టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నానీ నయ్యర్ మరణానికి సంతాపాన్ని తెలియజ్తేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా నయ్యర్ మృతికి ‘ఎక్స్’ పోస్ట్లో సంతాపం తెలిపారు. "భారతీయ వ్యాపార రంగంలో వినీత్ అతి పెద్ద వ్యక్తి" అని పేర్కొన్నారు. టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ‘ఎక్స్’లో వినీత్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది.1939లో జన్మించిన నయ్యర్ మసాచుసెట్స్లోని విలియమ్స్ కళాశాల నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఐఏఎస్ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన 40 ఏళ్ల కెరీర్లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో పనిచేశారు. పదేళ్లకుపైగా ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఆయన పలు కీలక పదవులను నిర్వహించారు. 2009లో కుప్పకూలిన కంప్యూటర్ సేవల సంస్థ సత్యం పునరుద్ధరణలో నయ్యర్ కీలక పాత్ర పోషించారు.It saddens me to share the news of the passing of Vineet Nayyar this morning.Vineet was a larger than life figure in the Indian Business landscape. A distinguished IAS officer, who then served with the World Bank, he became the first Chairman of GAILHe then made a hugely… pic.twitter.com/ZLlfzNXJ2K— anand mahindra (@anandmahindra) May 16, 2024
కొత్త ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సినవి..
స్టాక్మార్కెట్లో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మార్కెట్లో నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని పదాలకు సరైన అర్థం తెలుసుకోకపోతే డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. కంపెనీలు తమ వ్యాపారాలు నిర్వహించాలంటే ఉబ్బు అవసరం అవుతుంది. ప్రమోటర్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బు సంస్థ అవసరాలకు సరిపోదు. దాంతో సంస్థలో కొంత షేర్ను ఇన్వెస్టర్లకు ఇచ్చి దానివల్ల సమకూరే డబ్బుతో వ్యాపారం చేస్తాయి. కంపెనీలు సంపాదించే లాభంలో వారికి వాటా ఇస్తుంటాయి. ఈ క్రమంలో కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినవారు, ఇకపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు తెలుసుకోవాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.సెబీసెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) భారతీయ స్టాక్ మార్కెట్ను పర్యవేక్షిస్తోంది. కంపెనీలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, బ్రోకర్లు చేసే లావాదేవీలు, కార్యకలాపాలపై నిఘా వేయడానికి ఈ రెగ్యులేటర్ను ఏర్పాటు చేశారు.డీమ్యాట్ అకౌంట్డీమ్యాట్ లేదా డీమెటీరియలైజ్డ్ ఖాతా, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కస్టమర్ షేర్లు, ఇతర సెక్యూరిటీలను కలిగి ఉండే సాధనం. డీమ్యాట్ ఖాతా ద్వారా కంపెనీ షేర్లను కొనడం లేదా విక్రయించడం లాంటివి చేయొచ్చు. భారత్లో షేర్ మార్కెట్ లావాదేవీల కోసం డీమ్యాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.స్టాక్ స్ప్లిట్కంపెనీ షేరు ధర భారీగా పెరిగినా, ప్రైస్ టు ఎర్నింగ్ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్లు భావించినా ప్రస్తుత షేరును బహుళ షేర్లుగా విభజిస్తారు. ఉదాహరణకు ఒక కంపెనీ 1:2 స్టాక్ స్ప్లిట్ను ప్రకటిస్తే ప్రతి 1 షేరుకు పెట్టుబడిదారులు 2 అదనపు షేర్లు డీమ్యాట్లో చేరుతాయి.బుల్/బేర్ మార్కెట్బుల్ మార్కెట్లో కంపెనీల షేర్లను ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. దాంతో ఆ మార్కెట్లో షేర్ ధర పెరుగుతోంది. అయితే ఈ ట్రెండ్ చాలాకాలంపాటు కొనసాగుతుంటూ దాన్ని బుల్ మార్కెట్ అంటారు. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరత వల్ల మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ట్రెండ్ కొంతకాలంపాటు సాగింది. దాన్ని బేర్ మార్కెట్ అంటాం.స్టాక్ బ్రోకర్కంపెనీలను సంప్రదించి నేరుగా షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ లేదు. కాబట్టి దీని కోసం స్టాక్ బ్రోకర్ అనే వ్యవస్థ ఉంది. ఈ స్టాక్బ్రోకర్లు తమ క్లయింట్స్ కోసం షేర్లను కొనుగోలు చేయడం, అమ్మడం చేస్తారు. ఉదాహరణకు జెరోధా, అప్స్టాక్స్, ఫయ్యర్స్.. వంటివి స్టాక్బ్రోకర్లుగా ఉన్నాయి.డివిడెండ్కంపెనీ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసినపుడు లాభానష్టాలు ప్రకటిస్తాయి. లాభాలు ఆర్జించినప్పుడు దానిలో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్కు పంచుతాయి. కంపెనీలు పెట్టుబడిదారులకు స్వల్ప మొత్తంలో డివిడెండ్ను పంపిణీ చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వాటాదారులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంది. డివిడెంట్ చెల్లింపులు నగదుగా, స్టాక్స్ లేదా వివిధ రూపాల్లో జారీ చేయొచ్చు.ప్రైమరీ మార్కెట్/ఐపీఓఒక కంపెనీ మొదటిసారి షేర్లను జారీచేసి మూలధనం సమకూర్చాలంటే ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ షేర్ల జారీని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) అంటారు. కంపెనీలకు ఇది ఒక ముఖ్యమైన దశ. ఐపీఓ ద్వారా ఒక సంస్థకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులు నేరుగా కంపెనీకి వెళ్తాయి. కంపెనీ పెరుగుదలకు, విస్తరణకు ఉపయోగపడతాయి.
కోవాగ్జిన్తోనూ సైడ్ ఎఫెక్ట్స్..
బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’తోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది.భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు.సైడ్ ఎఫెక్ట్స్ వార్తల నేపథ్యంలో బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను వాణిజ్య కారణాలతో మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది.
భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, లింక్డ్ఇన్ సంయుక్తంగా వర్క్ ట్రెండ్ ఇండెక్స్-2024ను విడుదల చేశాయి. 31 దేశాల్లోని దాదాపు 31వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫార్చున్ 500 కంపెనీల కస్టమర్లు కూడా ఇందులో భాగమైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్లో 92 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ పనిలో ఏఐని వాడుతున్నారని నివేదికలో తెలిపారు. 91 శాతం కంపెనీలు ఏఐను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాల కల్పనలో, నిత్యం చేస్తున్న పనిలో, నాయకత్వంలో కృత్రిమమేధ ప్రభావం ఎలాఉందో ఈ సర్వే ద్వారా తెలియజేశామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘గత ఆరునెలల్లో జనరేటివ్ ఏఐ వల్ల పనిలో ఉత్పాదక దాదాపు రెండింతలు పెరిగింది. ఉద్యోగాలకోసం వెతికే వారి ప్రొఫైల్లో ఏఐ నైపుణ్యాలు తోడైతే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి లేనివారిని చాలా కంపెనీలు చేర్చుకోవడం లేదు. అయితే కొన్ని సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డామని భావిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు తమ సొంత ఏఐ టూల్స్ను వాడుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని పరిష్కరించాలంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికే చాలా రంగాలను మారుస్తుంది. వినియోగదారులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరిచి యూజర్ల ఆసక్తులను ప్రోత్సహిస్తే 2030 నాటికి దాదాపు సగంకంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని పీడబ్ల్యూసీ పరిశోధన విడుదల చేసింది. ఏఐ ప్రభావంతో 2030 నాటికి దక్షిణ యూరప్ జీడీపీ 11.5% వరకు పెరుగుతుంది. ఇది 700 బిలియన్ డాలర్లకు సమానం’ అని నివేదికలో తెలిపారు.కంపెనీ యాజమాన్యాలు, లేబర్ మార్కెట్కు సంబంధించి కృత్రిమమేధ ఏమేరకు ప్రభావం చూపుతుందో నివేదికలో తెలిపారు. ఈ వివరాలు కింద తెలియజేశాం.అధికశాతం ఉద్యోగులు తాము చేస్తున్న పనిలో ఏఐను వాడాలనుకుంటున్నారు. 75 శాతం వర్కర్లు ప్రస్తుతం పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకంతో పనిలో వేగాన్ని పెంచడానికి కష్టపడుతున్నారు. ఏఐ తమ సమయాన్ని ఆదా చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని, ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. 79 శాతం మంది తమ పనిలో ఏఐ కీలకంగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, అందులో 60 శాతం మంది తమ కంపెనీలో కృత్రిమమేధ వినియోగానికి సంబంధించి సరైన ప్రణాళిక లేదని తెలిపారు. 78 శాతం మంది తమ పనిలో సొంత ఏఐటూల్స్ను వాడుతున్నారు. కానీ ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాడుతున్న ఈ టూల్స్ వల్ల కంపెనీ డేటా ప్రమాదంలో పడుతుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..కృత్రిమమేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందికి ఉన్నప్పటికీ, డేటా భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే వారికి సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, క్రియేటివ్ డిజైన్..వంటి రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది రాబోయే సంవత్సరంలో తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్నారు. 66 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేనివారిని నియమించుకోవడం లేదు. కోపైలట్, చాట్జీపీటీ వంటే ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో 39శాతం మాత్రమే వారి ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించాయి. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం ఏఐ ట్రెయినింగ్ అందిస్తున్నాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
కార్పొరేట్
భారతీయ పర్యాటకులకు శుభవార్త.. ఇక ఆ దేశంలో 'ఫోన్ పే' సేవలు
క్యాన్సర్తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
కోవాగ్జిన్తోనూ సైడ్ ఎఫెక్ట్స్..
భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
అమెజాన్ ఉద్యోగులకు ఎంత కష్టం..!?
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
మరో 600 జాబ్స్కి గండం!
టెక్నాలజీ
పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్గా పనిచేశారు. GPT-4, ఓపెన్ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్ని రోజులు ఆన్లైన్లో సైబర్ నేరస్తులు.. దొంగచాటుగా ఓటీపీ సాయంతో యూజర్ల బ్యాంక్ అకౌంట్లలో సొమ్మును కాజేయడం రివాజుగా మారింది.కానీ రాను రాను సైబర్ మోసగాళ్లు తెలివి మీరుతున్నారు. తాజాగా, చెల్లెమ్మా.. మేం మీకు దేవుడిచ్చిన అన్నయ్యలం అంటూ అందిన కాడికి సొమ్మును దోచేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో లక్నోకు చెందిన ఓ మహిళను రవికుమార్, రాణా ప్రతాప్ సింగ్, మనోజ్ కుమార్లు పరిచయం చేసుకున్నారు. ఆ మహిళ తమపై నమ్మకం పెరిగేలా మెసిలారు. రోజులు గడుస్తున్నాయి. మాటలు కోటలు దాటాయి.ఆన్ లైన్ స్నేహాలు కాస్తా.. ఆఫ్ లైన్లోనే ఇరువురి ఫోన్నెంబర్లు ఇచ్చు పుచ్చుకునే వరకు వెళ్లింది. గుడ్ మార్నింగ్లు, గుడ్నైట్లు..ఫెస్టివల్ విషెస్తో ఆమెపై అన్న ప్రేమను ఒలకబోసేవారు. వారిపై ఆమెకు నమ్మకం కలగడంతో వ్యక్తిగత విషయాల్ని షేర్ చేస్తుండేది. అయితే ఓ రోజు త్వరలో తన పెళ్లి రోజు అంటూ ఇన్ స్టాగ్రామ్లో ఆ ముగ్గురికి చెప్పింది. అంతే ఆమె డబ్బును కాజేయాలని కేటుగాళ్లు ప్లాన్ చేశారు.ప్లాన్లో భాగంగా మనోజ్కుమార్ బాధితురాలికి ఫోన్ చేసి పెళ్లి రోజు సందర్భంగా ఖరీదైన పెళ్లి కానుక ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు షిప్పింగ్ అవసరాల కోసం తన ఆధార్ కార్డు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లను షేర్ చేసింది.కట్ చేస్తే విమానాశ్రయంలో తాను కొన్న ఖరీదైన గిఫ్ట్ను ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకున్నారని, దానిని విడిపించేందుకు కొంత మొత్తం చెల్లించాలని మనోజ్ ఆమెకు ఫోన్ చేశాడు. డబ్బులు చెల్లించేందుకు ఆమె ఒప్పుకోలేదు. ఫలితంగా బెదిరింపులు ఎక్కువయ్యాయి. నేను చెప్పినట్టు చేయకుంటే సీబీఐ, క్రైమ్ బ్రాంచ్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని ప్రమేయం చేసి నన్ను అరెస్టు చేస్తామని హెచ్చరించాడు. బెదిరింపుల కారణంగా, ఒత్తిడికి గురైన ఆమె క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో రూ.1.94 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో మోసపోయామంటూ బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ అభిజిత్ శంకర్ తెలిపారు. ఆన్లైన్లో దొరికే ప్రేమల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇలాగే నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు.
గూగుల్కు ఓటింగ్ శోభ!
లోక్సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని ప్రతి ఓటరు చూపుడు వేలు ఇంక్తో మెరిసే తరుణమిది. ఈ ప్రజాస్వామ్య పండుగ గూగుల్కు కొత్త శోభ తెచ్చింది. ఇంక్ అద్దిన వేలుతో సరికొత్త గూడుల్ను గూగుల్ సెర్చ్ పేజీపై ప్రదర్శిస్తోంది.దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నాల్గవ దశ ఓటింగ్ ప్రారంభమైంది. అదనంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 స్థానాలు, ఒడిశాలోని 28 స్థానాలకు కూడా ఈరోజు పోలింగ్ జరగనుంది. 4వ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.సార్వత్రిక ఎన్నికలలో నాల్గవ దశ ఓటింగ్పై నేటి గూగుల్ డూడుల్ భారత్లోని యూజర్లకు మాత్రమే కనిపిస్తుంది. అంతకుముందు, ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీలలో జరిగిన మునుపటి దశల పోలింగ్ అప్పుడు కూడా ఇంక్డ్ ఫింగర్ ఐకాన్ లోగోతో గూగుల్ డూడుల్ మెరిసింది.ఈరోజు పోలింగ్ జరుగుతన్న మొత్తం 96 లోక్సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, బీహార్లో 5, జార్ఖండ్లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1 ఉన్నాయి.
ఐఫోన్లో చాట్జీపీటీ ఫీచర్స్!.. ఓపెన్ఏఐతో యాపిల్ చర్చ
ఇప్పటికే పలు స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ ఐఫోన్ తయారీ సంస్థ 'యాపిల్' తన మొబైల్లో స్టార్టప్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఓపెన్ఏఐతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.రాబోయే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18లో చాట్జీపీటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఓపెన్ఏఐతో జత కట్టినట్లు సమాచారం. రెండు కంపెనీల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.ఒప్పందం కుదిరిన తరువాత ఈ టెక్నాలజీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ జెమినీ చాట్బాట్తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ చర్చలు ఇంకా పూర్తికాక ముందే.. యాపిల్ కంపెనీ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.యాపిల్ కంపెనీ జూన్లో నిర్వహించనున్న వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్పిరెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చాట్జీపీటీ వినియోగాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి అవసరం ఉందని, దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
మనీ మంత్ర
View allపుంజుకున్న స్టాక్మార్కెట్ సూచీలు
గ్రీన్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
పుంజుకున్న మార్కెట్ సూచీలు
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
పాక్షిక పెట్టుబడుల్లో మిలీనియల్స్
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
ఆటోమొబైల్
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
ప్రముఖ బిలినీయర్ 'గౌతమ్ సింఘానియా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల కూడా ఈయన మరో కారును కొనుగోలు చేశారు.గౌతమ్ సింఘానియా కొనుగోలు చేసిన కారు మెక్లారెన్ కంపెనీకి చెందిన 750ఎస్. దీని ధర మార్కెట్లో రూ.5.91 కోట్లు వరకు ఉంటుంది. అయితే సింఘానియా గ్యారేజిలో ఇప్పటికే రెండు మెక్లారెన్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. తాజాగా కొనుగోలు చేసిన మెక్లారెన్ 750ఎస్ కారు ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యుయల్-టోన్ షేడ్లో ఉండటం చూడవచ్చు.మెక్లారెన్ 750ఎస్ అనేది 720ఎస్ కంటే ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ కలిగి.. 750 పీఎస్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
దేశీయ ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలకు స్వస్తిచెబుతున్నారు. ధర కాస్త ఎక్కువే అయినా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ తరుణంలో పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVoomi కొత్త ఎలక్ట్రిక్ స్కూట్ మార్కెట్కు పరిచయం చేసింది. JeetX ZE పేరుతో విడుదల చేసిన బైక్ ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉండగా... దీని రేంజ్ 170 కిమీల పరిధిని వరకు ఉంది.మూడు విభిన్న వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బైక్ నార్డో గ్రే, అల్ట్రా రెడ్, అర్బన్ గ్రీన్ ఇలా ఎనిమిది రకాల రంగుల్లో JeetX ZE 2.1 కిలోవాట్ల పీక్ పవర్ కోసం రేట్ బీఎల్డీసీ మోటార్కు కనెక్ట్ చేసిన 3 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంది. గంటకు గరిష్టంగా 57 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయొచ్చు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5.5 గంటల సమయం పడుతుంది. 2.5 గంటల కంటే తక్కువ సమయంలో 50 శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
భారత్లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్పై గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్, ఫ్రంట్ బంపర్పై ఎయిర్ ఇన్టేక్ సరౌండ్లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్బాక్స్తో లభిస్తాయి.Make a bold statement with the Audi Q3 and Audi Q3 Sportback Bold Edition that come with the black styling package plus.*Terms and conditions apply.#AudiIndia #AudiQ3models #AudiBoldEdition pic.twitter.com/t6Yeq5CKT0— Audi India (@AudiIN) May 10, 2024
మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ తమ ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ కారులో 4వ జనరేషన్ మోడల్ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల వరకు (ఢిల్లీ ఎక్స్షోరూం) ఉంటుంది. ఈ కారును అభివృద్ధి చేయడంపై రూ. 1,450 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ అమ్మకాల్లో ప్రీమియం విభాగం వాటా 60 శాతంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 7 లక్షల యూనిట్లుగా ఉన్న ఈ సెగ్మెంట్ 2030 నాటికి పది లక్షల యూనిట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
రియల్టీ
పర్సనల్ ఫైనాన్స్
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?
సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్ ఎస్టేట్ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్ ఎస్టేట్ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్ మార్కెట్లో రిస్్కకు దూరంగా ఉండడం రిటైల్ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్సెట్తో ఉండాలి. బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్ అలోకేషన్). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్లో రిస్క్ డెట్లో రిస్క్ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్ సాధనాల ద్వారా క్రెడిట్ రిస్్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్’ను సైతం అరుణ్ కుమార్ సూచించారు.బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్ఐ (రోలింగ్ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్ అలోకేషన్ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్ (ఫిక్స్డ్ ఇన్కమ్)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్ఫోలియోలో డెట్ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్ కుమార్ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారు 70–80 శాతం లార్జ్క్యాప్నకు, మిడ్క్యాప్ స్టాక్స్కు 10–15 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్కు కేటాయింపులు చేసుకోవచ్చు.
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్ స్క్రాచ్ కార్డ్తో రూ.18 లక్షలు దోపిడీ
డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్ను ఉపయోగిస్తున్నారు.బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల పేరుతో స్క్రాచ్ కార్డ్లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్ పంపారు.ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
భారత ఎన్నికల సంఘం టైమ్టేబుల్ ప్రకారం ఏడు దశల లోక్సభ 2024 ఎన్నికల నాలుగో రౌండ్ మే 13న (సోమవారం) జరగనుంది. అయితే ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా నియోజకవర్గాలలోని స్కూల్స్, ఇతర సంస్థలకు ఈసీ సెలవు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం ఓటింగ్ జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు మే 13న 4వ దశ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ- కాశ్మీర్లో బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి.
దేశంలో బంగారం ధరలు.. తగ్గాయా? పెరిగాయా?
దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,360 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందివిశాఖ పట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,640గా ఉంది.ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,510గా ఉంది.కోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360గా ఉంది.
స్టార్టప్
ఎస్బీఐ బంపరాఫర్, స్టార్టప్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకు అవసరమైన ఆర్థిక సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్టప్లకు హబ్గా ఉంటున్న బెంగళూరులోని కోరమంగళలో తొలి బ్రాంచీని మంగళవారం ప్రారంభించింది. ప్రారంభ దశ మొదలుకుని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయ్యే వరకూ అంకుర సంస్థలకు అవసరమైన తోడ్పాటును ఈ శాఖ అందిస్తుందని బ్రాంచీని ప్రారంభించిన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఈ శాఖ అనుభవాలను పరిశీలించి, వచ్చే ఆరు నెలల్లో గురుగ్రామ్లో రెండోది, హైదరాబాద్లో మూడోది ప్రారంభించనున్నట్లు వివరించారు. రుణాలు, డిపాజిట్లు, రెమిటెన్సులు, చెల్లింపులు, ఫారెక్స్, బీమా తదితర సర్వీసులు, న్యాయ సలహాలు, డీమాట్.. ట్రేడింగ్ ఖాతాలు మొదలైనవన్నీ ఎస్బీఐ స్టార్టప్ బ్రాంచ్లో పొందవచ్చు. స్టార్టప్ వ్యవస్థలో భాగంగా ఉండే వివిధ వర్గాలన్నింటికీ అవసరమైన ఆర్థిక, సలహాలపరమైన సర్వీసులను ఇది అందిస్తుంది.
దేశంలో స్టార్టప్స్..7.46 లక్షల మందికి ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్ వ్యవస్థ ఇప్పటివరకూ 7.46 లక్షల ఉద్యోగాలు కల్పించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది. 49 శాతం స్టార్టప్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే ఉండటం దేశ యువత సామర్థ్యాలకు నిదర్శనమని ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. తొలి 10,000 అంకుర సంస్థలను గుర్తించేందుకు 808 రోజులు పట్టగా, మలి 10,000 స్టార్టప్లకు 156 రోజుల్లోనే గుర్తింపు లభించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధికంగా రోజుకు 80 అంకుర సంస్థలు గుర్తింపు పొందుతుండటమనేది స్టార్టప్ల సంస్కృతికి భవిష్యత్తు ఆశావహంగా ఉండనుందని తెలియజేస్తోందని వివరించింది.
'యూజ్ మీ' ఇట్స్ లోకల్ గురూ!
ఆన్లైన్ కొనుగోళ్లకు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రముఖ సంస్థలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి మనకు దగ్గర్లోని దుకాణాలు అందుబాటులో ఉండే యాప్స్ ఉన్నాయా? వాటిలో ధరలు సరిపోల్చుకునే అవకాశం ఉందా? అంటే ఉంది. సరికొత్తగానగరవాసులకు పరిచయమైనయూజ్ మీ యాప్తో ఇవి సాధ్యమే. సాక్షి, సిటీబ్యూరో :నగరానికి చెందిన సంజయ్ కప్పగంతుల మెకానికల్ ఇంజినీర్. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో నాలుగేళ్లు పనిచేసి 1999లో అమెరికా వెళ్లాడు. 13ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశాడు. ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకొని 2013లో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. అయితే సాఫ్ట్వేర్ కంపెనీ కంటే సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపే సంస్థ ఏదైనా తీసుకురావాలని ఆలోచించాడు. ఒక్క ఫోన్కాల్తో అన్ని సేవలందించే విధానానికి శ్రీకారం చుట్టాడు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత యాప్ రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అప్పటికే జస్ట్ డయల్ లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో ఫీడ్బ్యాక్ ప్రధాన సమస్య అని గుర్తించి ‘యూజ్ మీ’ యాప్ రూపొందిచినట్లు సంజయ్ చెప్పారు. యూజర్స్–వెండర్స్ కనెక్ట్.. ‘ఆన్లైన్ సేవల విషయంలో ఇప్పటికే కొన్ని యాప్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా పెద్ద దుకాణాలు, ప్రముఖ సేవల సంస్థలే అందుబాటులో ఉంచారు. మన దగ్గర్లోని కిరాణ దుకాణాలు, స్వీట్ షాప్స్, కూల్ డ్రింక్స్, బైక్ మెకానిక్ సెంటర్స్, ప్లంబర్ తదితర అందులో ఉండవు. 70 శాతం మంది ఇలాంటి అవసరాలున్నవారే ఉన్నారు. పైగా వినియోగదారుడికి, దుకాణాదారుకు మధ్య అనుసంధానం ఉండదు. అందుకే ‘యూజ్ మీ’ యాప్ రూపొందించాం. యూజర్స్, వెండర్స్ను కనెక్ట్ చేశాం. ప్రస్తుతం చాటింగ్ చేయడం ఎక్కువగా జరుగుతోంది. అందుకే చాట్ ద్వారానే ఈ ప్రకియ పూర్తి చేసేలా యాప్ను తీర్చిదిద్దామ’ని సంజయ్ వివరించారు. గల్లీ కొట్టులో కొనుగోలు చేయొచ్చు... ‘ఈ యాప్ సహాయంతో వినియోగదారులకు సమీపంలోని వ్యాపార సంస్థలు, సేవలందించే వాటి వివరాలు జీపీఎస్ ఆధారంగా తెలియజేస్తున్నాం. తద్వారా నచ్చిన సేవలు పొందొచ్చు. సేవలు, వ్యాపార విధానంలో ఇదో విప్లవాత్మక మార్పు. సమీపంలోని కిరాణా దుకాణాలకు ఆర్డర్ ఇవ్వొచ్చు. మీరు కొనుగోలు చేయబోయే వస్తువును ఇతర దుకాణాల్లో ఎంతకు విక్రయిస్తున్నారో తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఈ తరహా సేవలందించే వాళ్లు ప్రమోషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మా వద్ద 56 కేటగిరీలు, 3 లక్షల వెండర్ల డాటా ఉంది. దీనిని పైలట్ ప్రాజెక్టుగా గత నెలలో హైదరాబాద్, విజయవాడలో ప్రారంభించాం. మా సేవలకు సానుకూల స్పందన వస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ యాప్ తీసుకురానున్నామ’ని చెప్పారు సంజయ్.
అలరించిన డెమో షో..
కాజీపేట అర్బన్: ప్రపంచాన్ని క్రికెట్ ఆట శాసిస్తుందంటే అతిశయోక్తి కాదు. నేడు చిన్న పిల్లల నుంచి వృద్ధులకు వరకు టీవీల్లో క్రికెట్ వస్తుందంటే బయట అడుగుపెట్టకుండా టీవీలకే అత్తుకుపోతారు. అంతటి క్రేజ్ గల క్రికెట్ ఆటకు నూతన ఓరవడినందిస్తూ సరికొత్తగా వర్చువల్ రియాల్టీ (కాల్పనిక) క్రికెట్కు రూపకల్పన చేశారు. ఐఐటీ ఢీల్లీలో విద్యను పూర్తి చేసిన సిద్దిపేటకు చెందిన త్రివిక్రం, హైదరాబాద్కు చెందిన వసంతసాయి సాంకేతిక విద్యనభ్యసించి ప్రోయుగా అనే సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. ప్రోయుగా కంపెనీకి సీఈఓగా భాద్యతలు నిర్వర్తిస్తున్న త్రివిక్రం రూ.కోటి జీతాన్ని అందించే కొలువును సైతం వదులుకుని ప్రపంచానికి తన మేధా శక్తి అందించాలనే తపనతో తొమ్మిది నెలలు శ్రమించి ‘ఇంపాక్ట్ బిలియన్’ అనే సందేశంతో వర్చువల్ రియాల్టీ క్రికెట్ను ఆవిష్కరించాడు. ఆడుతున్న అనుభూతి... ప్రోయుగా కంపెనీ ద్వారా రూపొందించిన స్టార్టప్ ఐబీ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో ఆహ్లాదకరమైన మైదానంలో చుట్టూ ప్రేక్షకులు, బరిలో క్రీడాకారులు, బంతిని విసురుతున్న బౌలర్ను తలపిస్తూ బ్యాటింగ్ చేస్తున్న అనుభూతిని అందిస్తుంది. కళ్లకు ప్రత్యేకంగా రూపొందించిన హెడ్సెట్, కస్టమ్ బ్యాట్, సెన్సార్లను ప్రత్యేకంగా రూపొందించారు. వివిధ సాప్ట్వేర్ల అనుసందానంతో హెడ్సెట్ను ధరించినప్పుడు దానికి అనుసంధానంగా ఉన్న మానీటర్లో కనిపించే అంతర్జాతీయ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న అనుభూతితో క్రికెట్లో లోకంలో విహరిస్తారు. నిజంగా బౌలింగ్కు ఎదురొడ్డి బ్యాటింగ్ చేస్తున్నట్లుగా సిక్సర్లు కొడుతారు. వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన ప్రోయుగా తన స్టార్టప్ వీఆర్ క్రికెట్ విశేషంగా అలరించింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆసక్తిగా ఐబీ క్రికెట్ను ఆడేందుకు ఉత్సాహాన్ని చూపారు. వీస్పోర్ట్గా ప్రపంచానికి వర్చుయల్ క్రికెట్ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు గాను ఏప్రిల్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 25 వేల ఐబీ క్రికెట్ స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. రాబోవు రోజుల్లో ప్రస్తుతం ఆదరణ పొందుతున్న క్రీడల మాదిరిగా వర్చుయల్ క్రికెట్ను అందించాలనే లక్ష్యంతో ప్రోయుగా ముందుకు సాగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం... ఫిబ్రవరి 22న లక్నోలో నిర్వహించిన ఐటీ ఇన్వెస్టర్స్ సమీట్లో భాగంగా ప్రోయుగా రూపొందించిన ఐబీ క్రికెట్ను రాష్ట్రపతి రాంనా«థ్ కోవింద్ తొలి బ్యాటింగ్తో ప్రారంభించారు. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, యూనియన్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ బ్యాట్పై తొలి సంతకం చేశారు. వీస్పోర్ట్స్గా ప్రపంచానికి... ప్రోయుగా కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన ఐబీ క్రికెట్ను వీస్పోర్ట్స్గా ప్రపంచ వ్యాప్తంగా అందించేందుకు కృషిచేస్తున్నాం. ప్రఖ్యాత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మంచి ఆదరణ సాధిస్తుందని అభినందించా రు. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వీస్పోర్ట్స్గా ఐబీ క్రికెట్ను ఏర్పాటు చేసేందుకు ఏప్రిల్లో 25 వేల ఐబీ క్రికెట్ స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాం. – నీరధ్, వినోద్కర్, పంకజ్,ఐబీ క్రికెట్ నిర్వాహకులు
Business exchange section
Currency Conversion Rate
Title | Rate | Date |
---|---|---|
EUR | 90.648214 | 2024-05-16 |
USD | 90.648214 | 2024-05-16 |
Commodities
Name | Rate | Change | Change% |
---|---|---|---|
Silver 1 Kg | 90800.00 | 90800.00 | 100.00 |
Gold 22K 10gm | 66740.00 | 66740.00 | -10.00 |
Gold 24k 10 gm | 72810.00 | 72810.00 | -10.00 |
Stock Action
Name | LTP | Rate | Change% |
---|---|---|---|
EMKAY:NSE | Emkay Global Financial Services Ltd | 174.7 | 13.5891 |
RAMCOSYS:NSE | Ramco Systems Ltd | 340.9 | 19.993 |
SADBHAV:NSE | Sadbhav Engineering Ltd | 34.85 | -9.9483 |
DANGEE:NSE | Dangee Dums Ltd | 7.95 | -11.6667 |
EMKAY:NSE | Emkay Global Financial Services Ltd | 155.75 | 9.9929 |