ప్రధాన వార్తలు
అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్కలర్లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్లో పాల్గొన్న తన ట్రూప్ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్-రాధికల రెండో ప్రీవెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్షిప్లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్ ప్రయాణం సాగుతుంది.అనంత్ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024
భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..
ఎలక్ట్రానిక్ ట్రక్కుల ధరలు భారీగా తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాటి ధరలో కనీసం 20-25శాతం సబ్సిడీ లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఫేమ్3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మధ్యస్థం నుంచి భారీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై రాయితీలు ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి. ఈమేరకు ఏడాది చివర్లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడనుందని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.మీడియా కథనాల ప్రకారం..ప్రభుత్వం కొత్త సబ్సిడీ స్కీమ్ ఫేమ్3ను ఈ ఏడాది చివర్లో తీసుకురానుందని అంచనా. ఇందులో హెవీ ఎలక్ట్రానిక్ ట్రక్కులపై 20-25శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ-ట్రక్కుల ధర మార్కెట్లో రూ.70లక్షలు నుంచి రూ.90 లక్షలుగా ఉంది. ఒకవేళ అంచానాల ప్రకారం ప్రభుత్వం ఫేమ్3లో వీటి రాయితీపై నిర్ణయం తీసుకుంటే వాహనదారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. అయితే హైబ్రిడ్ ప్యాసింజర్ వాహనాలను ఈ సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకూడదని చర్చలు జరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్ఫేమ్3 పథకానికి దాదాపు రూ.9,500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ పథకంలో భాగంగా ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు పెంచేందుకు వాహనదారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. నేషనల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్ఈఎంఎంపీ)లో ఉన్న ఫేమ్ ఇండియా1ను 2015, ఏప్రిల్1 నుంచి మార్చి 31, 2019 వరకు కొనసాగించారు. ఇందుకోసం రూ.895 కోట్లు కేటాయించారు. ఫేమ్2ను మార్చి 31, 2024 వరకు దాదాపు రూ.10వేల కోట్లుతో తీసుకొచ్చారు. ఇందులో ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, ఇ-రిక్షాల కొనుగోళ్లపై వినియోగదారులకు సబ్సిడీ అందించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఫేమ్3ను ప్రారంభించనున్నట్లు తెలిసింది.
నేడు సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్లైనర్ రాకెట్లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు. అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్పై బోయింగ్ స్టార్లైనర్ పనిచేస్తోంది.ప్రాజెక్ట్లో భాగంగా బోయింగ్ స్టార్లైన్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చెందిన హార్మోనీ మాడ్యుల్ సబ్సిస్టమ్స్ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్లో సమస్య తలెత్తడంతో.. కౌంట్డౌన్ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్ విల్ మోర్ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది. 2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు.
యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్
మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ సంస్థ తన బేస్ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది.టిక్టాక్తో పోటీపడేలా ఫేస్బుక్లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్ ఫీచర్ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్బుక్ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్బుక్ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నివేదికయువత యాప్ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్డాన్స్ యాజమాన్యంలోని స్మాల్ వీడియో యాప్ టిక్టాక్ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్ప్లేస్, గ్రూప్లు, స్మాల్ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్ లేదా రీల్స్ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు.
తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నివేదిక
ఆర్థికవృద్ధిని కొనసాగిస్తూనే ప్రభుత్వం మూలధన వ్యయంపై దృష్టి పెడుతుండడంతో ఈ ఏడాది వృద్ధి నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలో తెలిపింది. 2024-25 ఏడాదిలో సీపీఐ ద్రవ్యోల్బణం సగటున 4.5%గా ఉంటుందని అంచనా వేసింది. 2023-24లో నమోదైన 5.4% ద్రవ్యోల్బణం కంటే ఇది తక్కువ.ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తువినిమయం ఊపందుకుంటుందని పేర్కొంది. ఈఏడాదిలో వృద్ధిని ప్రేరేపించేందుకు మూలధన వ్యయంలో సగానికిపైగా ఫైనాన్సింగ్ రంగంలో రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. గతేడాదిలో మూలధనవ్యయం రూ.9.5 ట్రిలియన్లుగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ.11.11 ట్రిలియన్లకు పెంచాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పింది.ఈ ఏడాది దేశ జీడీపీ 7% వరకు పెరుగుతుందని అంచనా వేసింది. కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పెరగడం, వస్తువినిమయం పెరుగుతుండడం, రెండంకెల క్రెడిట్ వృద్ధి వంటి అంశాలు ఆర్థిక ప్రగతికి సానుకూలంగా ఉన్నాయని చెప్పింది. కానీ కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భవిష్యత్తులో ప్రతికూల వాతావరణాన్ని ఏర్పరిచే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేసింది. దానివల్ల వస్తుసరఫరాలో మార్పులుంటాయని చెప్పింది. ప్రధాన పంటల ఉత్పత్తిలో తగ్గుదల వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితం చెందవచ్చని భావిస్తుంది.
భారత్కు 100 టన్నుల బంగారం
ముంబై: బ్రిటన్ వాల్టుల్లో భద్రపర్చిన 100 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ దేశీ ఖజానాకు తరలించింది. 1991లో భారత్ విదేశీ మారక సంక్షోభాన్ని అధిగమించేందుకు పసిడిని తాకట్టు పెట్టిన అనంతరం ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తరలించడం ఇదే ప్రథమం అని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిటన్ నుంచి బంగారం తరలింపు విషయంలో ఆర్థిక శాఖ, ఆర్బీఐ, ఇతరత్రా ఏజెన్సీలు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు, అత్యంత విలువైన లావాదేవీ కావడంతో చాలా గోప్యత పాటించినట్లు వివరించాయి. రవాణా సౌలభ్యం తదితర అంశాలు పసిడి తరలింపునకు కారణమని పేర్కొన్నా యి. ప్రస్తుతం దేశీయంగా ముంబై, నాగ్పూర్లో పటిష్టమైన వాల్టుల్లో బంగారాన్ని నిల్వ చేస్తున్నారు. తాజా పరిణామంతో దేశీయంగా భద్రపర్చిన మొ త్తం పసిడి పరిమాణం 408 టన్నులకు చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం 2024 మార్చి ఆఖరు నాటికి భారత్ వద్ద మొత్తం 822 టన్నుల బంగారం ఉంది. ఇందులో సుమారు 413.79 టన్నులు విదేశీ వాల్టుల్లో ఉన్నాయి. గత కొన్నాళ్లుగా గణనీయంగా పసిడి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విదేశాల్లో దాన్ని నిల్వ చేయడాన్ని తగ్గించుకోవాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తగ్గనున్న వ్యయాలు.. ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొనడానికి దేశాలు కొన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మొదలైన వాటి వాల్ట్లలో సురక్షితంగా నిల్వ చేస్తుంటాయి. ఇందుకు కొంత చెల్లిస్తుంటాయి. తాజాగా బంగారాన్ని మన దేశానికి తరలించి, ఇక్కడే నిల్వ చేయ డం వల్ల విదేశీ కస్టోడియన్లకు చెల్లించాల్సిన స్టోరేజీ ఫీజుల భారాన్ని ఆర్బీఐ తగ్గించుకోగలుగుతుంది.
అయిదు రోజుల అమ్మకాలకు బ్రేక్
ముంబై: దేశీయ జీడీపీ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. నేడు(శనివారం) ఎగ్జిట్ పోల్స్, వచ్చే మంగళవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అప్రమత్తత కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 76 పాయింట్లు పెరిగి 73,961 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు బలపడి 22,530 వద్ద నిలిచింది. దీంతో సూచీల అయిదురోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇటీవల వరుస పతనంలో భాగంగా కనిష్టాలకు దిగివచి్చన బ్యాంకులు, ఫైనాన్స్, మెటల్ ఇంధన, కన్జూమర్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్లో సెన్సెక్స్ 593 పాయింట్లు బలపడి 74,479 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 22,654 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. నెలాఖరున డాలర్లకు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ ఆరంభ నష్టాలు కోల్పోయింది. అమెరికా బ్రోకేరేజ్ సంస్థ జెప్ఫారీస్ ‘బై’ రేటింగ్తో అదానీ షేర్లు భారీగా పెరిగాయి. డాలర్ మారకంలో 13 పైసలు బలహీనపడింది 83.42 స్థాయి వద్ద స్థిరపడింది.
రిషి సునాక్ బ్యాగ్ ధరెంతో తెలుసా..
సెలబ్రిటీలు వాడే ప్రతి వస్తువు సామాన్యులకు ఎప్పుడూ ప్రత్యేకమే. వారు ధరించే షూ, వేసుకునే దుస్తులు, వాడే కారు, పెట్టుకునే వాచీలు, ఉపయోగించే బ్యాగులు.. ఇలా అన్ని స్పెషల్గా కనిపిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ రైల్వేస్టేషన్లో యూకే ప్రధాని రిషిసునాక్ వాడిన బ్యాగ్ గురించి నెట్టింట వైరల్గా మారింది.రాబోయే బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా రిషి సునక్ ప్రచారంలో పాల్గొనేందుకు ఇటీవల రైలులో ప్రయాణించారు. లండన్ నుంచి బయలుదేరిన ఆయన రాత్రంతా రైలు స్లీపర్క్లాస్లో ప్రయాణించి కార్న్వాల్కు చేరుకున్నారు. అందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా. రిషి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే అందరి కళ్లు ఆయనతోపాటు తాను వాడుతున్న బ్యాగ్పై పడింది. దేశంలోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటైన 'ఆర్ఎస్'ను సూచించే మోనోగ్రామ్ ఉన్న బ్యాక్ప్యాక్ను ధరిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాంతో వీక్షకులు తాను వినియోగించిన బ్యాక్ప్యాక్ ధరెంతో తెలుసుకునే పనిపడ్డారు. దీని విలువ సుమారు రూ.79వేలు ఉంటుందని తెలిసింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్లో ఫస్ట్ బర్త్డేది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ రిపోర్ట్ ప్రకారం..రిషి సునక్, తన భార్య అక్షతామూర్తి నికర విలువ 651 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు(సుమారు రూ.6900 కోట్లు). బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ 3 కంటే వీరే సంపన్నులు. ఈ జంట సంపద కేవలం ఒక సంవత్సరంలోనే 120 మిలియన్ పౌండ్లకు పైగా పెరిగింది.Paddington Station, London: Rishi Sunak boarding the sleeper train to Cornwall, sporting a £750 luxury monogrammed Tumi Arrive Bradley backpack pic.twitter.com/ojWi76ovcu— Jane Fleming (@fleming77) May 29, 2024
Flipkart Big End of Season Sale 2024: రేపటి నుంచే ఫ్లిప్కార్ట్ సీజన్సేల్.. ఆఫర్లు ఇవే..
ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ జూన్ 1 నుంచి ‘బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్ సేల్లో ఫ్యాషన్ కేటగిరీలోని వస్తువులపై ఆకర్షణీయలమైన ఆఫర్లు ఉంటాయని చెప్పింది.బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2024లో భాగంగా ఫ్లిప్కార్ట్ 12,000 బ్రాండ్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. 2 లక్షలకు పైగా అమ్మకందారుల నుంచి వీటిని ఎంపిక చేశామని చెప్పింది. స్పోర్ట్స్ షూ, గడియారాలు, జీన్స్ వంటి వాటిని ఓపెన్-బాక్స్ డెలివరీ అందిస్తామని పేర్కొంది. ఒక లక్షకు పైగా ఉత్పత్తులను బుక్ చేసుకున్న రోజే డెలివరీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ సేల్లో అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని, కంపెనీ ఆఫర్లను అందరూ వినియోగించుకోవాలని కోరింది.ఫ్లిప్కార్ట్ ఈ సేల్లో భాగంగా తమ కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్ను అందిస్తుంది. ఆర్బీఎల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్బీసీ బ్యాంక్ (కనీస ఆర్డర్ విలువ రూ.2,500) క్రెడిట్ కార్డ్లపై ఉత్పత్తి ధరలో 10% ఇన్స్టాంట్ తగ్గింపు ఇస్తున్నారు. కనీసం రూ.200 విలువ చేసే ఉత్పత్తులను యూపీఐ పేమెంట్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్లో ఫస్ట్ బర్త్డేఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ అరీఫ్ మొహమ్మద్ మాట్లాడుతూ..‘మార్కెట్లో పేరున్న బ్రాండ్లను వినియోగదారులకు తక్కువ ధరకే ఇస్తున్నాం. దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీ వంటి విభాగాల్లో మరింత ట్రెండింగ్ వస్తువులను అందిస్తున్నాం. కస్టమర్లకు 75 లక్షలకు పైగా విభిన్న ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సేల్ను ఒక వేడుకగా జరుపుతున్నాం. ఇందులో 10 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా స్పోర్ట్స్ షూస్, లగేజ్, వాచీలు, ఎత్నిక్ సూట్లు, పార్టీ డ్రెస్లు వంటి వాటిపై ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు.
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
EPF New rules: ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరట కల్పించింది. దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.ఆన్లైన్లో దాఖలు చేసిన క్లెయిమ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్ను ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రం అప్లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది.మరి క్లెయిమ్ వెరిఫై ఎలా?చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలు అప్లోడ్ చేయని పక్షంలో క్లెయిమ్ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు..ఆన్లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది.డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు.సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ను యూఐడీఏఐ ధ్రువీకరిస్తుంది.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
కార్పొరేట్
అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్
యువతను ఆకర్షిస్తున్న ఫేస్బుక్
రిషి సునాక్ బ్యాగ్ ధరెంతో తెలుసా..
Flipkart Big End of Season Sale 2024: రేపటి నుంచే ఫ్లిప్కార్ట్ సీజన్సేల్.. ఆఫర్లు ఇవే..
అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్లో ఫస్ట్ బర్త్డే
టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా
అంబానీ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో చూశారా?
డిగ్రీ ఉన్నా..లేకపోయినా భారీ ఉద్యోగాలు.. లింక్డ్ఇన్ నివేదిక
ఇకపై బ్యాంక్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్లుండవు.. ఎవరికంటే..
క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
టెక్నాలజీ
ఎస్ఎమ్ఎస్ స్కామర్లపై డాట్ కొరడా.. బ్లాక్లిస్ట్లో 8 సంస్థలు
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT), కేంద్ర హోమ్ శాఖ సహకారంతో సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మోసపూరిత కమ్యూనికేషన్లను పంపినందుకు ఎనిమిది ఎస్ఎమ్ఎస్ హెడర్లను బ్లాక్లిస్ట్ చేసినట్లు తెలిపింది.గత మూడు నెలల్లో ఈ ఎనిమిది హెడర్ల నుంచి 10,000 కంటే ఎక్కువ మోసపూరిత సందేశాలు వెళ్లాయి. అదే సమయంలో ఈ సందేశాలను పంపించడానికి ఉపయోగించిన 73 ఎస్ఎంఎస్ హెడ్డర్స్, 1522 కంటెంట్ టెంప్లేట్లను డాట్ బ్లాక్లిస్ట్లో పెట్టింది. కాబట్టి ఈ హెడ్డర్స్ ఇకపై ఎలాంటి మెసేజ్లను పంపించలేవు.మోసపూర్తి ఎస్ఎమ్ఎస్ల నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర హోమ్ శాఖ 'సంచార్ సాతీ' కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరైనా మోసపూరిత సందేశాలను అందుకున్నప్పుడు.. లేదా ఇబ్బంది పడుతున్నప్పుడు వారు సంచార సాథీ పోర్టల్లోని చక్షు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా స్పామ్ మీద కంప్లైంట్ చేయడానికి 1909కి కాల్ చేయవచ్చు.. లేదా DND (డు నాట్ డిస్ట్రబ్) అనే సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.
ట్రేడింగ్ స్కామ్.. రూ.1.07 కోట్లు మాయం - ఎక్కడంటే?
టెక్నాలజీ పెరుగుతున్న వేళ సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల నవీ ముంబైలోని ఖార్ఘర్ టౌన్షిప్కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి షేర్ ట్రేడింగ్ స్కామ్లో రూ.1.07 కోట్లు మోసపోయారు. విచారణలో భాగంగా ఓ యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.సైబర్ మోసాలు కొత్తేమీ కాదు. అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టర్లు రూ.1,762 కోట్లు నష్టపోయినట్టు ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) వివరాలు చెబుతున్నాయి. ఇందులో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు మాత్రమే కాకుండా.. గేమింగ్ యాప్స్, చట్ట విరుద్ధమైన లోన్ యాప్స్, ఓటీపీలను ఇతరులకు షేర్ చేయడం వంటివి ఉన్నాయి.ఇటీవల నవీ ముంబైలో సైబర్ మోసానికి ఎరగా చిక్కిన వ్యక్తిని మోసగాళ్లు ఫిబ్రవరి 13 నుంచి మే 5 వరకు పలుమార్పు కలిసి షేర్ ట్రేడింగ్ నుంచి లాభాలను ఇప్పిస్తామని నమ్మించారు. ఆ తరువాత వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. 10709000 డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు డిపాజిట్ చేయించుకున్న తరువాత ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (చీటింగ్) వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మొత్తం కేసులుఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( I4C ) ప్రకారం.. 2023లో 1 లక్షకు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కామ్ల ద్వారా మోసపోయిన వారు 20,043 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. డేటింగ్ యాప్ల వల్ల మోసపోయిన వారి సంఖ్య 1725గా నమోదైంది. ఇలా వివిధ రూపాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మాయ చేస్తూ.. మోసం చేస్తున్నారు.మోసగాళ్ల కొత్త అవతారాలు..మోసగాళ్లు తమ ఫోన్ నంబర్లను చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి తరచుగా కాల్ స్పూఫింగ్ ఉపయోగిస్తారు. స్కామర్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి ఏజెన్సీల అధికారులుగా నటిస్తారు. ఇది నిజమని నమ్మి ప్రజలు మోసపోతున్నారు.
వారెన్ బఫెట్ నుంచి బిల్ గేట్స్ నేర్చుకున్న పాఠం ఏంటంటే?
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ప్రతి సెకనును తన షెడ్యూల్ అనుగుణంగా పని చేసేవారు. అలా చేయడం తన విజయానికి కారణమని భావించేవారు. కానీ కొన్నేళ్లకు బిల్గేట్స్ తాను చేస్తుందని తప్పని భావించారు. అందుకు బెర్క్షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ కారణం.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ ప్రతి సెకనును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేవారు. అయితే 2017లో తన స్నేహితుడు వారెన్ బఫెట్ కలిసి గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారెన్ బఫెట్ షెడ్యూల్ తనకి చూపించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.ఆ సమయంలో బఫెట్ తన క్యాలెంటర్ను చూపించడం నాకు ఇంకా గుర్తింది. అందులో ఏమీ లేదు. కానీ ఆ షెడ్యూల్ నాకు ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్నెస్కు నిదర్శనం కాదు. మీరు చదవడానికి, ఆలోచించడానికి, రాయడానికి సమయం కేటాయించండి. జీవితంలో నిజమైన ప్రాముఖ్యతలేవో వారెన్ బఫెట్ నాకు తెలియజేశారు అని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు.
2025 నాటికి సూపర్ కంప్యూటర్.. పక్కా ప్లాన్తో సిద్దమైన మస్క్
టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల అధినేత 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఇటీవల తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI ప్రణాళికలను పంచుకున్నారు. అంతే కాకుండా సూపర్ కంప్యూటర్ను తయారు చేయడానికి సంబంధించిన విషయాన్ని కూడా పంచుకున్నారు.మస్క్ ఏఐ చాట్బాట్ గ్రోక్ కోసం 2025 నాటికి సూపర్కంప్యూటర్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని డెవలప్ చేయడానికి ఒరాకిల్తో భాగస్వామ్యాన్ని xAI పరిశీలిస్తోందని మస్క్ పేర్కొన్నారు. ఒరాకిల్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2025 చివరి నాటికి సూపర్ కంప్యూటర్ లాంచ్ అవుతుంది. రాబోయే సూపర్ కంప్యూటర్ ఎన్విడియా టాప్-ఆఫ్-ది-లైన్ H100 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల సమూహాలను కలిగి ఉంటుందని సమాచారం. ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీపీయూ క్లస్టర్ల కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి వేగవంతమైన పనితీరును అందిస్తాయి.ఇప్పటికే అందుబాటులో ఉన్న మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ, గూగుల్ ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి మస్క్ xAI స్థాపించారు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడానికి మస్క్ సన్నద్ధమవుతున్నారు. ఇక రాబోయే సూపర్ కంప్యూటర్ ఎలా ఉండబోతోందో చూడాలంటే ఇంకో ఏడాది వేచి ఉండక తప్పదు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
మనీ మంత్ర
View allతీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు సూచీలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్లు..22,930 వద్ద నిఫ్టీ
కొత్త గరిష్టాలను చేరిన స్టాక్మార్కెట్ సూచీలు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్లు..22,950 మార్కు వద్దే నిఫ్టీ
ఆటోమొబైల్
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
టెస్లా పవర్ ఇండియా కంపెనీకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పేరు మీద ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఉంటే వాటి అమ్మకాలతో సహా ఇతర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గురుగావ్ కేంద్రంగా సేవలందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్రేడ్మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కు ప్రతిస్పందనగా ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెస్లా పవర్పై కేసును హైకోర్టు గురువారం విచారించనుంది.టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్తో భారత్లోని స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తోందని, దీనిపై గందరగోళం నెలకొందని.. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించింది. అంతేకాదు టెస్లా పవర్ బ్యాటరీలపై తమకు (టెస్లా-యూఎస్) ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో టెస్లా వెల్లడించింది. టెస్లా పవర్ బ్యాటరీలు ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీవేనని ప్రచారం చేయడం, లోగోను వినియోగించుకున్నట్లు హైలెట్ చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మస్క్ తరుపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
బ్రెజిల్లో దూసుకెళ్తున్న బీవైడీ.. 5000 మందికి ఉద్యోగాలు!
చైనా కార్ల తయారీ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రెజిల్లో తన 100వ డీలర్షిప్ ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 250కి పెంచాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.బ్రెజిల్లో బీవైడీ 100వ డీలర్షిప్ను ఫ్లోరియానోపోలిస్ డౌన్టౌన్లో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బ్రెజిల్లో బీవైడీ సేల్స్ నెట్వర్క్ కింద 39 డీలర్ గ్రూపులను కలిగి ఉంది. అంతే కాకుండా 100 స్టోర్లను, 135 అవుట్లెట్ల కలిగి ఉన్నట్లు సమాచారం.రాబోయే రోజుల్లో కంపెనీ బ్రెజిల్లో మరో 150 కొత్త స్టోర్లను నిర్మించనుంది. 2024 చివరి నాటికి 250 డీలర్షిప్లను ఏర్పాటు చేయాలంటే.. నెలకు కనీసం 19 డీలర్షిప్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బ్రెజిల్లో తన ఉనికిని విస్తరిస్తూ.. విక్రయాల నెట్వర్క్ పెంచడానికి కంపెనీ యోచిస్తోంది.బీవైడీ కంపెనీ బ్రెజిల్లో అతి పెద్ద తయారీ సైట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ చాసిస్, కొత్త ఎనర్జీ ప్యాసింజర్ కార్ ప్రొడక్షన్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ మెటీరియల్ వంటి వాటిని తయారు చేస్తుంది. ఇక్కడ ఏడాదికి 1,50,000 యూనిట్ల కార్లను (ఎలక్ట్రిక్, హైబ్రిడ్) తయారు చేయనున్నట్లు, స్థానికంగా 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు సమాచారం.బీవైడీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో ఉత్పత్తి ఈ ఏడాది చివరి నుంచి లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఇందులో బీవైడీ డాల్ఫిన్, సాంగ్ ప్లస్, యువాన్ ప్లస్, డాల్ఫిన్ మినీ వంటి కార్లను తయారు చేయనుంది.
ఈ స్కూటర్ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. గత దశాబ్ద కాలంలో 10 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్, జుపీటర్ 125 అమ్మకాలు మాత్రం 63 శాతం ఉన్నట్లు సమాచారం.భారతీయ స్కూటర్ మార్కెట్లో జుపీటర్, జుపీటర్ 125 వాటా 25 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జుపీటర్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 844863 యూనిట్లు. గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో జుపీటర్ పొందిన అత్యుత్తమ అమ్మకాలు ఇవే అని స్పష్టమవుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ అమ్మకాలు కేవలం 98937 యూనిట్లు మాత్రమే.110సీసీ, 125సీసీ వేరియంట్లలో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్3. కాగా టీవీఎస్ కంపెనీకి చెందిన రైడర్ 125 (478443 యూనిట్లు), ఎక్స్ఎల్ (481803 యూనిట్లు), అపాచీ (378112 యూనిట్లు), ఎన్టార్క్ 125 (331865 యూనిట్లు) వేహనాలు ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి.
టాటా కారుకి ‘సుమో’ అనే పేరు ఎలా వచ్చింది ? ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే..
విలాసం కోసం కాకుండా కారు అవసరం అనే యుగంలో ఉన్నాం మనం. అందుకే కాబోలు ప్రతి నగరం, పట్టణం, గ్రాముల్లో కార్ల వినియోగం పెరిగిపోయింది. అయితే నైన్టీస్లో అలా కాదు. మారుతి 800, 1000 తర్వాత 1990లలో టాటా కంపెనీ ‘టాటా సుమో ఎంయూవీ’ని మార్కెటికి పరిచయం చేసింది. నాటి నుంచి టాటా కార్లలో టాటా సుమో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటిగా నిలిచింది. ఎంతలా అంటే కేవలం మూడేళ్లలో లక్షకుపైగా అమ్ముడు పోయింది. అదే సమయంలో టాలీవుడ్ వెండితెరపై సుమోలు ఎగిరించి.. కథానాయకులతో తొడలు కొట్టించి.. మాస్ ప్రేక్షకుల్ని మురిపించిన దర్శకులు వెలుగులోకి వచ్చారు.అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన టాటా సుమో కారు వెనుక కథ ఏంటో తెలుసా? ఈ కారుకు సుమో అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి ? ఈ పేరు జపనీస్ రెజ్లర్ల నుండి ప్రేరణ పొందిందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది తప్పు. టాటాలో కష్టపడి పనిచేసి, టాటా సంస్థ విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగి పేరు మీద టాటా సుమో అని కారుకి పేరు పెట్టారు.పుకార్లు షికార్లుసాధారణంగా ప్రతి రోజు టాటా మోటార్స్ టాప్ ఎగ్జిక్యూటీవ్లు అందరూ కలిసి భోజనం చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మూల్గావ్కర్ అలా కాదు రోజు ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత వచ్చేవారు. ఆ తర్వాత టాటా డీలర్లు మూల్గావకర్కు ఫైవ్స్టార్ హోటళ్లలో లంచ్ ట్రీట్ ఇచ్చారని, అందుకే తమతో భోజనానికి రావడం లేదనే పుకార్లు వ్యాపించాయి.ట్రక్ డ్రైవర్లతో రోడ్ సైడ్ దాబాలో ఇంతకీ ఎండీ తమతో భోజనానికి ఎందుకు రావడం లేదా అనే ప్రశ్నే ఉన్నత ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రశ్నార్ధకంగా మారేది. అయితే దీన్ని చేదించేందుకు కొంతమంది ఉద్యోగులు మూల్గావ్కర్ మధ్యాహ్న దినచర్య గురించి తెలుసుకునేందుకు రహస్యంగా ఆయన్ను వెంబడించారు. వారు ఆశ్చర్యానికి గురి చేసేలా మూల్గావ్కర్ ట్రక్ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన దాబాలో ఆహారం తింటూ కనిపించారు. భోజన సమయంలో టాటా వాహనాలు వినియోగిస్తున్న డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులు గురించి చర్చించేవారు.లోపాల్ని సరిదిద్దే ప్రయత్నంఏ అంశాలు బాగున్నాయో, లోపాల్ని గుర్తించిన తర్వాత కార్యాలయానికి వచ్చేవారు. అందులో పనిచేస్తున్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్ అభివృద్దికి మూల్గావ్కర్ కృషి చేశారు.టాటా సుమో పేరు అలా వచ్చిందికాబట్టే టాటా ఆయన పేరు మీద ఐకానిక్ ఎస్యూవీని లాంచ్ చేసింది. సు-మంత్ మో-ఓల్గాకర్ పేరు మొదటి అక్షరాలతో టాటా సుమో పేరును మార్కెట్కి పరిచయం చేసింది. చివరగా టాటా సుమో గోల్డ్ 10 సీట్ల ఎస్యూవీ ధరరూ.5.26లక్షల నుంచి రూ.8.93లక్షల మధ్య ఉంది.
రియల్టీ
పర్సనల్ ఫైనాన్స్
లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్ల లాభంతో 74436 వద్ద నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 22644 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.అదానీ ఎంటర్ ప్రైజెస్,లార్సెన్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైండ్ ట్రీ, భారతీ ఎయిర్టెల్,సిప్లా, టాటా కాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఎథేర్ మోటార్స్ కొటక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
దిగివచ్చిన బంగారం, వెండి!
బంగారం కొనుగోలుదారులకు దాదాపు రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 30) భారీగా తగ్గాయి. 10 గ్రాములు (తులం) బంగారం రూ.440 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో..రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు తగ్గింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,850 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 తగ్గి రూ.72,910 వద్దకు క్షీణించింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.67,300 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.490 దిగొచ్చి రూ.73,420 వద్దకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.వెండి ధరదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు భారీగా రూ.1200 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
ఆరోగ్య బీమా పాలసీదారు క్లెయిమ్ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్సపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి తుది బిల్లు వచ్చాక మూడు గంటల్లోపు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. బుధవారం ఈమేరకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై ఉన్న 55కు పైగా ఆదేశాలను క్రోడీకరించి దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.సర్క్యూలర్లోని వివరాల ప్రకారం..క్లెయిమ్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలు, థర్డ్పార్టీ ఏజెన్సీలు తమకు అవసరమైన పత్రాలను పాలసీదారుల నుంచి కాకుండా నేరుగా ఆసుపత్రుల నుంచే సేకరించాలి. వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా బీమా పాలసీని అందించాలి. అవసరాన్ని బట్టి కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది.ఐఆర్డీఏఐ చేసిన కొన్ని మార్పులు..డిశ్చార్జీకి మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగి ఆసుపత్రి ఏదైనా అదనపు ఛార్జీలు విధిస్తే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ భరిస్తుంది.చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే వెంటనే క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. తక్షణమే ఆసుపత్రి నుంచి మృత దేహాన్ని తమ బంధువులకు అప్పగించాలి.పాలసీదారులకు సహాయం చేయడానికి బీమా కంపెనీలు ఆసుపత్రిలో ఫిజికల్ మోడ్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయవచ్చు.ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న పాలసీదారులు తమకు ఆమోదయోగ్యమైన క్లెయిమ్ పొందగలిగే పాలసీని ఎంచుకోవచ్చు.పాలసీ తీసుకునేందుకూ, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.బీమా కంపెనీలు పాలసీ డాక్యుమెంట్తో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ని కూడా అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు.. వంటివి సులభ పదాల్లో తెలియజేయాలి.పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్లు చేయకపోతే వారికి నో క్లెయిమ్ బోనస్ లేదా ప్రీమియం తగ్గించే అవకాశాన్ని కల్పించవచ్చు.ఇదీ చదవండి: పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్లుఇటీవల లోకల్ సర్కిల్ చేసిన సర్వేలో 43 శాతం బీమా పాలసీదారులు గత మూడేళ్లలో తమ బీమా క్లెయిమ్లను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. చాలామంది పాలసీదారులు ఆసుపత్రిలో చేరిన చివరి రోజు వరకు తమ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సర్వే తెలిపింది.
వెండే బంగారమాయెగా..
న్యూఢిల్లీ: వెండి ధర దేశంలో సరికొత్త రికార్డులను చూస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేజీ ధర క్రితం ముగింపుతో పోల్చితే బుధవారం రూ.1,150 ఎగిసి రూ.97,100కి ఎగసింది. ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 3,707 ఎగసి రూ.94,118కి చేరింది. చెన్నైసహా పలు నగరాలు, కొన్ని పట్టణాల స్పాట్ మార్కెట్లలో ఏకంగా రూ.లక్ష దాటినట్లు కూడా సమాచారం అందుతోంది. గడచిన పది రోజుల్లో వెండి ధర దాదాపు రూ.11,000 పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు విలువైన మెటల్స్ ధర పెరగడానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఢిల్లీలో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర క్రితంతో పోలి్చతే రూ.250 పెరిగి రూ.73,200కు చేరగా, ముంబైలో రూ.222 ఎగసి రూ.72,413కి చేరింది.
స్టార్టప్
2024 ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితా
ఫోర్బ్స్ తన 30 అండర్ 30 ఆసియా తొమ్మిదవ ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 300 మంది యువ పారిశ్రామికవేత్తలు, లీడర్స్, ట్రయల్బ్లేజర్లు ఉన్నారు. వీరి వయసు 30 ఏళ్లకంటే తక్కువ.అండర్ 30 ఆసియా క్లాస్ ఆఫ్ 2024లో ది ఆర్ట్స్, ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్, మీడియా మొదలైన 10 విభాగాల్లో 300 మంది ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్నవారిలో కే-పాప్ గర్ల్, సింగపూర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ వెరోనికా శాంతి పెరీరా, అషియా సిటీకి చెందిన జపాన్ యొక్క అతి పిన్న వయస్కుడైన మేయర్ రియోసుకే తకాషిమా మొదలైనవారు ఉన్నారు."30 అండర్ 30 ఆసియా" జాబితాసియాన్ డాసన్ - ఆస్ట్రేలియా: ది ఆర్ట్స్మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా: ఎంటర్టైన్మెంట్ & స్పోర్ట్స్అలీనా నదీమ్ - పాకిస్తాన్ : ఫైనాన్స్ & వెంచర్ క్యాపిటల్ఎరికా ఎంగ్ - మలేషియా: మీడియా, మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్యూమీ హ్వాంగ్ - సౌత్ కొరియా: రిటైల్ & ఇకామర్స్జు యుయాంగ్ - చైనా: ఎంటర్ప్రైజ్ టెక్నాలజీఅక్షిత్ బన్సల్ & రాఘవ్ అరోరా - ఇండియా: ఇండస్ట్రీ, మాన్యుఫ్యాక్టరింగ్ & ఎనర్జీజాంగ్ జికియాన్ - చైనా: హెల్త్కేర్ & సైన్స్భాగ్య శ్రీ జైన్ - ఇండియా: సోషల్ ఇంపాక్ట్జాన్సన్ లిమ్ - సింగపూర్: కన్స్యూమర్ టెక్నాలజీ
వందలాది ఉద్యోగుల తొలగింపు.. సారీ చెప్పిన సీఈవో
ఫిన్టెక్ కంపెనీ సింపుల్ (Simpl) వివిధ విభాగాల్లో వందలాది ఉద్యోగులను తొలగించింది. యూజర్ల చేరిక మందగించడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో 15 శాతం దాదాపు 100 మందిని కంపెనీ వదిలించుకుంది. కోతల ప్రభావం ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో అత్యధిక జీతాలు అందుకునే ఉద్యోగులపై పడినట్లు తెలుస్తోంది.తాజా తొలగింపులకు ముందు, సింపుల్ దాదాపు 650 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో ప్రధాన కార్యకలాపాలు, ఇంటర్న్లు, కాల్ సెంటర్ ఏజెంట్లు ఉన్నారు. ఈ స్టార్టప్లో ఇవి వరుసగా రెండవ సంవత్సరం తొలగింపులు. 2023 మార్చిలో సింపుల్ దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ తొలగింపుల్లో కొంతమంది ఇటీవలే చేరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగంలో చేరి ఒకటి లేదా ఒకటిన్నర నెలలు మాత్రమే కావడం గమనార్హం.కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో నిత్యానంద్ శర్మ బుధవారం టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. లేఆఫ్ల నిర్ణయానికి విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. అవుట్ప్లేస్మెంట్ సహాయంతో సహా ప్రభావితమైన వారికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు.
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్తో ఓలా క్యాబ్స్ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్ ఫిజిక్స్ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah)
Business exchange section
Currency Conversion Rate
Commodities
Name | Rate | Change | Change% |
---|---|---|---|
Silver 1 Kg | 98000.00 | 98000.00 | -200.00 |
Gold 22K 10gm | 66500.00 | 66500.00 | -200.00 |
Gold 24k 10 gm | 72550.00 | 72550.00 | -210.00 |
Stock Action
Name | Rate | Change% |
---|---|---|
Emkay Global Financial Services Ltd | 174.7 | 13.5891 |
Ramco Systems Ltd | 340.9 | 19.993 |
Sadbhav Engineering Ltd | 34.85 | -9.9483 |
Dangee Dums Ltd | 7.95 | -11.6667 |
Emkay Global Financial Services Ltd | 155.75 | 9.9929 |